రోడ్ల మీద ఇంకా సన్నటి చీకటి పొంచి ఉంది. కాలికి ఒక రాయి తగిలినట్లు కాలు విదిలించుకుంటూ గట్టిగా భూమ్మీదకు తన్ని అడుగేశాడు. అప్పుడు అతని కుడి కాలు నేలను తాకిన చోటునుండి ఒక నీటి ఊట పైకి చిమ్మడం మొదలైంది. అతను నమ్మలేకపోయాడు. ఆ ఊట ఆరడుగుల ఎత్తుకు పైకి చిమ్ముతోంది.

గాలిలో 60 సెకన్ల పాటు ప్రయాణించే ఒకే ఒక్క ఫిరంగి గుండు మార్గాన్ని పూర్తిగా లెక్కించడానికి ఒక హ్యూమన్ కంప్యూటర్ దాదాపు 20 గంటల సమయం తీసుకునేది. అదే లెక్కింపును ఎనియాక్ (ENIAC) కేవలం 30 సెకన్లలో పూర్తి చేసింది.

రాత్రి నగరాన్ని కప్పదు. వివస్త్రను చేస్తుంది. పగలు ధరించిన అబద్ధాల్ని ఒక్కొక్కటిగా విప్పి, అసలు ముఖాన్ని బయటపెడుతుంది… రాత్రి పదకొండు దాటిన తర్వాత నగరం పాత్రలు మార్చుకుంటుంది. పగలు అధికారంతో మాట్లాడిన మనుషులు, రాత్రి ఒంటరిగా నడుస్తారు. పగలు నవ్విన ముఖాలు, రాత్రి ఆలోచనలతో నిండిపోతాయి.

ఆసన్నమైయున్న మహాయుద్ధం నిమిత్తమై మంత్రాలోచన చేసేందుకు సభను ఏర్పాటు చేశాడు దుర్యోధనుడు. భీష్ముడిని తమ సర్వసైన్యాధిపతిగా ఎన్నుకున్న కాస్సేపట్లో పాండవదూతగా శ్రీకృష్ణుడు వచ్చేస్తాడు, సంధి పొసగదన్న నిశ్చయంతోనే. దూతను అమర్యాద చేద్దామనుకున్న దుర్యోధనుడి పథకం కృష్ణమాయ ముందు చతికిలపడుతుంది.

తెలుగు సాహిత్యంలో వ్యవసాయ కార్మికులు, రైతు, రైతుకూలీల పై విస్తృతంగా సాహిత్యం వెలువడింది. కానీ పారిశ్రామిక రంగాలలో పనిచేసే కార్మిక జీవితాలపై వచ్చిన సాహిత్యానికి చాలా తక్కువ పేజీలే ఉన్నాయి. కానీ ఇప్పటికీ పారిశ్రామిక కార్మికుల జీవితాలపై తెలుగులో వచ్చిన సాహిత్యం చాలా తక్కువనే చెప్పుకోవాలి. వంగపండు మాత్రం తన తొలి రోజుల నుంచే, అనగా 80వ దశాబ్దానికి పూర్వమే, తన రచనల ద్వారా కార్మిక సాహిత్యానికి ఒక స్థానం కల్పించాడు.

యవ్వనంలో స్నేహితుని భుజం మీది చేయిలోనో,
ప్రియురాలి చూపులోనో కరిగిపోయినపుడూ,
జీవననేస్తం తొలి కౌగిళ్ల నమ్మకమైన స్పర్శలో,
బిడ్డల అమాయకపు లేత చూపుల్లో,
వాళ్ళు నీ కొనసాగింపనే ఉద్వేగంలోనూ
నువ్వుగా ఉంటావు

ఏవేవో ఎండమావులు
భ్రమించి పరుగులు తీస్తాం
ఎడారి చిగురిస్తుందని
తాపగ్రస్తమైన దీని విశాల దేహం మీద
ఎక్కడైనా ఒక తడికన్ను రెప్ప విప్పుతుందని

అదృష్టం ఎలా ఉందో చూద్దాం,’ అని కిటికీ పరదా పక్కకు తప్పించగానే చంద్రకాంతిలో మిలమిలలాడుతోన్న మనస్లు శిఖరం హలో చెప్పింది. క్షణాల్లో రెండు మూడు పొరల ఉన్ని బట్టలు వేసేసుకుని నేనూ గిరీషూ మేడమీదికి చేరిపోయాం… పువ్వుకు తావిలాగా ఆ బంగారు శిఖరం నడికొప్పున పల్చని మబ్బు తెర జయకేతనంలా నిలచి, శిఖరంతోపాటు తానూ రంగులు మార్చుకోసాగింది.

ఆధునికతనుండి అత్యాధునిక యుగానికి దారిలో అడ్డంగా నిలబడిన మేరువు హైడెగర్. అతన్ని దాటడం కష్టం. దాటకుండా యీ యుగంలోకి నడవడం కష్టం. అతడి ప్రభావం ఒక రంగంలో కాదు. తత్త్వశాస్త్రం అటుంచి, మనస్తత్త్వశాస్త్రం, మానసికవైద్యం, సాహిత్యవిమర్శ, సాంకేతికత, పర్యావరణము-బహుశా అతడి ప్రభావంలేని ఆధునికరంగం లేదేమో!

ఒడిస్సియస్ ‌ధనుస్సును సుతారంగా నిమిరేడు. దానిని నిలువునా నిలబెట్టి సునాయాసంగా వంచి నారితాటిని బిగించేడు. బిగించి, సరిగ్గా ఉందో లేదో చూడడానికి, వీణ తీగను మీటినట్లు మీటేడు. వానకోయిల కూజితంలా శబ్దం ధ్వనించింది. దానికి ప్రతిధ్వనిలా ఆకాశంలో ఉరుములు ఉరిమేయి.

పురాణ కథలు ఎందుకు చదవాలి? అవి మనకు ఏమిటి బోధిస్తాయి? అవి చదవడంవల్ల మనం మన ప్రస్తుత జీవితాలను ఎలా మలుచుకోగలం? పురాణకథలలో ఉన్న నీతులు, బోధలు అర్థం చేసుకుని మనం ఈ కాలంలో ఏ విధంగా లబ్ధి పొందగలం? కాలం మారింది. విలువలు మారేయి కదా. ఎప్పుడో శతాబ్దాల క్రితం హోమర్ రాసిన ఇలియాడ్, ఓడిస్సీ గ్రంథాలు ఇప్పుడు చదవడంవల్ల లాభం ఏమిటి?

సమస్తమూ ఈశ్వరునిలో చేరియున్నదే. నదులన్నీ సముద్రంలో కలిసినట్లు లోకభేదాలన్నీ ఆత్మలో ఎలా ఐక్యమవుతాయో, సాగరంలోని తరంగంలా జీవుడు పృథక్త్వ భావాన్ని వీడి పరమాత్మతో ఎలా మమేకం కావాలో డి.వి.గుండప్ప గారి ఈ పద్యాలు అద్వైత వేదాంత సారాన్ని అత్యంత సులభంగా వివరిస్తున్నాయి.

వాడ్రేవు చినవీరభద్రుడు తన తొలి కవితా సంపుటి అంటే “నిర్వికల్ప సంగీతం” వెలువరించి నలభయ్యేళ్ళయింది. ఈ నలభయ్యేళ్ళలో ఆనాడే అజంతా జ్యోతిష్యం చెప్పినట్టుగా తెలుగు సాహిత్య ప్రపంచంలో భవిష్యత్తంతా ఇతనిదే అయింది… తలుపులు బార్లా తెరిచి అజరామరమైన ప్రకృతిని లోపలికి ఆహ్వానించాల్సిన అవసరమేదో ఈ కవిని మేల్కొల్పింది.

గాలి నాసరరెడ్డికి లేఖలు’ పుస్తకంలో 56మంది కవులు, పండితులు, కవితాప్రియులు రాసిన 84 ఉత్తరాలు సంకలింపబడ్డాయి… మొత్తం మీద ఈ లేఖా సంకలనంలోని బడాబాబుల పొడి మాటలూ, సన్నజీవాల తడి తలపులూ పాఠకుల హృదయాల్ని కదిలిస్తాయి; కొండొకచో కలవరపరుస్తాయి కూడా.

నెచ్చెలి 7వ వార్షికోత్సవం (జూలై 10, 2026) సందర్భంగా నిర్వహిస్తున్న కథా, కవితా పురస్కార పోటీలకు రచనలకు ఆహ్వానం!