కాంతి రూపాలన్నీ – సూర్య రశ్మి, కొవ్వొత్తి వెలుగు, మిణుగురు పురుగు మెరుపు – విద్యుత్ రూపాలే
మార్చి 2026
చరిత్రలాగే సాహిత్య విమర్శ అనేది ఒక నిరంతర ప్రవాహం. అది గతసాహిత్యాన్ని వర్తమానంతో అనుసంధానించి పునర్విశ్లేషించే ఒక వారధి. దండి రాసిన కావ్యాదర్శమ్, విద్యానాథుని ప్రతాపరుద్రీయమ్, ముమ్మటుడి కావ్యప్రకాశమ్, ఆనందవర్ధనుడి ధ్వన్యాలోకమ్, రాజశేఖరుడి కావ్యమీమాంసవంటి ప్రాచీన లాక్షణిక గ్రంథాలను చదివినప్పుడు, వేల సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు విమర్శనాత్మక దృక్పథాన్ని ఎంత శాస్త్రీయంగా విశ్లేషించారో అర్థమవుతుంది. అయితే, ఆ ప్రాచీనజ్ఞానాన్ని ఆధునిక సాహిత్యానికి, ఆధునిక సామాజిక కోణాలకు ఎలా అన్వయించుకోవాలి అన్నదే నేటి విమర్శకుల ముందున్న ప్రధానాంశం.
ప్రాచీన కావ్యమీమాంసలో చర్చించిన అనేక వర్గీకరణలు, రస-ధ్వని సిద్ధాంతాలు నేటి సాహిత్యానికి అనువర్తనీయాలే. ప్రాచీన భారతీయ కావ్యవిమర్శనుండి మనం ప్రధానంగా అలవర్చుకోవాల్సింది సత్యాన్ని శోధించే తత్త్వాభినివేశలక్షణాన్ని. ఆధునిక సాహిత్యం కేవలం ఆనందాన్ని, రసాన్ని మాత్రమే ఇవ్వదు; అది సామాజిక అస్థిరతలను, వర్గపోరాటాలను, మానసిక సంఘర్షణలను చర్చిస్తుంది. ఇక్కడే పాశ్చాత్య విమర్శన సిద్ధాంతాలు మనకు కొత్త ఆయుధాలను అందిస్తాయి. ఉదాహరణకు, ఝాక్ డెరిడావంటి వారు ప్రతిపాదించిన వినిర్మాణవాదం ఒక రచనలో ఒకే స్థిరమైన అర్థం ఉండదని చెబుతుంది. అవి సామాజిక సంఘర్షణలకు, మానవ మనస్తత్వ సంక్లిష్టతలకు, అస్తిత్వవాదాలకు ప్రతీక. ప్రసిద్ధ రష్యన్ సాహిత్య విమర్శకుడు మిఖాయిల్ బాఖ్తిన్ సిద్ధాంతం ప్రకారం, గొప్ప క్లాసిక్ రచనలు ఎన్నటికీ ఒకే కాలానికి లేదా ఒకే కోణానికి పరిమితం కావు; అవి బహుళ స్వరాలను, బహుళార్థాలను (polyphony) కలిగి ఉండి, తరాలు మారేకొద్దీ పాఠకులకు ఎన్నెన్నో కొత్త అర్థాలను స్ఫురింపజేస్తూనే ఉంటాయి. పాఠకుడినిబట్టి, కాలాన్నిబట్టి అర్థాలు మారుతూ ఉంటాయి. ఒక ఆధునిక కవితనో, కథనో విశ్లేషించేటప్పుడు ప్రాచీన లాక్షణికులు ప్రతిపాదించిన రస, ధ్వని సిద్ధాంతాల మూలాలను మనం విస్మరించలేం. అంతర్లీనంగా ఉండే భావాన్ని పట్టుకోవడానికి ధ్వని సిద్ధాంతం నేటికీ అద్భుతమైన సాధనమే. కానీ, అదే సమయంలో సాహిత్యంలోని భావాల విస్తృత సామాజిక, రాజకీయ, ఆర్థిక, మానసిక ప్రభావాల వివేచనకు ఆధునిక మానవీయశాస్త్ర సిద్ధాంతాలు అత్యావశ్యకం.
నిజమైన విమర్శకుడు ప్రాచీన సాహిత్యంలోని గాంభీర్యాన్ని, నిర్మాణ కౌశలాన్ని జీర్ణించుకోవాలి. అలాగే, ఆధునిక విమర్శ సిద్ధాంతాలైన నిర్మాణాత్మకవాదం, సామాజికశాస్త్ర దృక్పథం, మనోవిశ్లేషణలను తన పరిశీలనకు ఆయుధాలుగా మలచుకోవాలి. వెల్చేరు నారాయణరావుగారిలాంటి పండితులు చేసిన కృషిలో మనకు కనిపించేది ఈ సమన్వయమే. వారు ప్రాచీన ప్రబంధాలను విశ్లేషించినా, ఆధునిక కవిత్వాన్ని అంచనా వేసినా అందులో ప్రాచీన మీమాంస తాలూకు సునిశితత్వం, ఆధునికత తాలూకు సామాజికశాస్త్ర దృష్టి కలగలిసి ఉంటాయి. ఈ రెండింటి సమన్వయమే భారతీయ భాషలలో సాహిత్య విమర్శకు ప్రాణం పోస్తుంది. కొత్తపాతల మేలుకలయికగా సాగే ఇటువంటి విమర్శే తెలుగు సాహిత్యానికి శ్రీరామరక్ష.
[వేలూరి వేంకటేశ్వరరావుగారు సాహిత్యవిమర్శ గురించి మాతో పంచుకొన్న అనేకానేక ఆలోచనల్లో కొన్ని సంభాషణలు పై ముందుమాటకు స్ఫూర్తి. ఇప్పుడు ఆయన ఇంద్రసభలో కూర్చుండి ‘స్వర్గంలో స్ట్రిప్టీజ్’ చూస్తున్నా అక్కడినుండే మనల్ని గమనిస్తూ, బహుశా తన మరణవార్తపై వచ్చిన స్పందనలపై ఇప్పటికే ఒక వ్యంగ్యకథను అల్లుతూ ఉంటారని ఊహించవచ్చు. వీడ్కోలు వేలూరి గారూ! మీరు పరిపూర్ణంగా జీవించారు, ప్రపంచాన్ని, సాహిత్యాన్ని, మనుషుల్ని మనసారా ప్రేమించారు. మీ మాటలు, రచనలు, ఎత్తిపొడుపులు, శ్రేయోక్తులు ఈమాట కుటుంబానికి సదా స్మరణీయాలు — సం.]
మాటలకంటే ఎక్కువ కొట్లాడుకునేవాళ్ళం. ఆ మాటల మధ్యలోనే తెలుగు సాహిత్యమూ, దాని వెనుకనున్న హిపోక్రసీ ఇవన్నీ సంభాషణల్లో భాగమయ్యేవి.
అచ్చుయంత్రం వేల, లక్షల పుస్తకాలు ప్రజల మీదకు పడేస్తున్నది. ఈ యాంత్రిక యుగంలో ఎప్పటికైనా గ్రంథ దహనోద్యమం ప్రారంభం కాక తప్పదు. ఎందుకంటే, అచ్చు యంత్రాలు లేని రోజుల్లో, మంచి గ్రంథాలు నిలిచి చెత్త గ్రంథాలు పోయేందుకు ఎవరూ ప్రత్యేకంగా శ్రద్ధ వహించాల్సిన అవసరం లేక పోయేది.
ఒక్కమాటలో చెప్పాలంటే, వేలూరి కథలు అమెరికా తెలుగువాళ్ల వ్యవహారశైలిపై సుతిమెత్తగా చురకలంటించిన వ్యంగ్య కథలు. కథని, పాత్రలను నిర్మించటంలో, నడిపించటంలో ఆయనకొక ప్రత్యేక పద్ధతి ఉంది. అది అమెరికాలోని ఇతర తెలుగు రచయితల శైలికి భిన్నమైంది. హాస్య, వ్యంగ్య ధోరణిలో కథలు నడిపినా, వాటిల్లో ఆవేదన, ఆవేశం ఉన్నాయి. అవి పాఠకులను అలరిస్తూనే ఆలోచింపజేస్తాయి.
వేలూరి వేంకటేశ్వరరావుగారు రాసిన ‘కావ్యదహనోత్సవం’ ఆడియో రూపంలో కథాసంగ్రహం.
పరిచయకర్త/స్వరం – కొప్పర్తి రాంబాబు
వేలూరి వేంకటేశ్వరరావుగారి రచన వార్ధక్యం ఆడియో రూపం ఇక్కడ వినగలరు.
వేలూరి వేంకటేశ్వరరావుగారికి ఇష్టమైన కాటుక కంటినీరు పద్యంపై వారి వ్యాసానికి ఆడియో రూపం.
చదివిన వారు: రాజేష్ భరద్వాజ
తెలుగు నిఘంటువు గురించి వేలూరి వేంకటేశ్వర రావు గారి వ్యాసం చదివిన వారు: రాజేష్ భరద్వాజ
ఆకుల మీదుగా
రాలిపడే వానచినుకులు
లోయలో మృదువుగా
వినిపించే అలౌకిక ధ్వనులు
వెన్నెల పరుచుకోవాల్సిన పున్నమి నాడే మబ్బులు మూగినట్టు
కొండల్ని పిండి చేయగలిగే యవ్వనంలోనే
నానావిధభయసంజనితనిర్బలత
నక్షత్రాలు కనపడినంత కాలం
చూస్తూ ఉండు
ఒకరోజు నీకూ నక్షత్రాలకీ మధ్య
దట్టమైన ధూళిమేఘం
చిరస్థావరం కట్టుకోవచ్చు
మనం దేని మీద పంతాలు పోతామో
అది అసత్యమో అర్ధసత్యమో ఐనప్పుడు
ఒక్క ఒప్పుకోలు కొన చాలు
ఆకాశాన్ని నిలువునా చీల్చే
అంతు లేని దుఃఖం
ముంచెత్తినపుడల్లా
ఈ దుర్భరబాధ ఇదే చివరిసారి అని
ఇంకెప్పుడూ కలగదని
అనుకుంటూ ఉంటాను.
అరవై వరకూ వ్యాసాలున్న ఈ సంపుటి మురళీధరరావుగారి సారస్వతప్రేమ, పరిశోధన, పాండిత్యం అనే మూడు నదులు సంగమించిన ప్రయాగ. ఆయన 15 సంవత్సరాలపాటు తెలుగు, హిందీ, సంస్కృతము, ప్రాకృతము, ఆంగ్లముల సాహిత్యాలతో పాటు పలు ప్రపంచభాషా సాహిత్యాల చరిత్రలను కూలంకషంగా, తపస్సువంటి అధ్యయనం చేశారు.
ఈ ఆదివారం రాసిన సుదీర్ఘమైన ఉత్తరంలో తన పెళ్ళినిశ్చయం ప్రకటించాడు: ‘అతి ముఖ్యమైన విషయం ఉత్తరం చివరివరకు వాయిదా వేశాను. కుమారి ఫ్రీడా బ్రెండెన్ఫీల్డ్తో నా పెళ్ళి నిశ్చయమయింది. అమ్మాయిది బాగా ఉన్నవాళ్ళ కుటుంబం.
ప్రాచీన తమిళ పద సంపద చాలా విస్తారమైనది. క్లుప్తత, గాఢత సంగ కాలపు తమిళ భాష ముఖ్య లక్షణాలు. వాటిని బిగువు చెడకుండా తెలుగు చేయడం కష్టసాధ్యమైన పనే. ‘ఈమాట’ పాఠకులు నా అనువాద ప్రయత్నాన్ని సహృదయతతో స్వీకరిస్తారనే భావిస్తాను.
మహెజబీన్ కవితలు మధుకుల్యలు, తేనె వాకలు. వాక్యం చలువరాయి అయితే, కవిత ఒక చల్లని ఇల్లు. పాఠకులు ఎంతసేపైనా సేదదీరగల అద్భుతమైన సృజనాత్మకత ఈమె సొంతం.
బేలూరులోని ఈ చెన్నకేశవాలయం మానవకళాచాతుర్యానికి పరాకాష్టగా, అవధి లేని అందాన్ని ప్రదర్శించింది. అదొక అత్యద్భుతపు, అశాశ్వతత్వపు విరోధాభాస. కళారూపావిష్కరణ కాలాతీతమే అయినా, కాలం కొట్టే కరుకు దెబ్బలను భరించక తప్పదులెమ్మని చరిత్ర చెప్పడమే ఆ విరోధాభాస.
మేము నడుస్తోన్న దారి క్షేమం కాదనీ, అడుగు ఏమాత్రం తడబడినా దిగువనున్న బుధిగండకి మాకోసం ఎదురుచూస్తోందనీ మా అందరికీ తెలుసు. అంతా కలసి 30 సెంటీమీటర్ల వెడల్పు ఉన్న దారి… అడుగడుగూ చూసుకుంటూ వెళ్ళవలసిన దారి… సరిగ్గా అదే సమయంలో నా హెడ్ లాంప్ పని చెయ్యడం మానేసింది.
“మరణించినవారి లోకం కంటే బ్రతికున్నవారి లోకం ఎంత అందంగా ఉందో…” అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు. ఉదయభానుడి కిరణాల వెచ్చటి స్పర్శకు ఒడిస్సియస్ కళ్ళు తెరిచాడు. ఎదురుగా సర్సీ కనిపించింది. ఇంద్రధనుస్సులోని సప్తవర్ణాలతో మెరుస్తూన్న ఆమె దుస్తులు ఆమె సహజ సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తున్నాయి.
అయ్యన్నీ వొగ్గేసుకుని ఆడనుండి ఈ బెంగలూరు వట్టుకొచ్చాడయ్య! మా మునసబు గోరి సిన్నోడు లేరయ్య. ఆరు దేవుడండయ్య! నేనే ఆరెంట బడ్డానండి! ఆయన గోరికి సెక్కూరిటీ ఏపారమంటండి. ‘కాపలాలు కాయాలిరా సత్తీ కాస్తావా’ అన్నారండి.
నేను కుక్కను కాలేనా ఏంటి? నేనవుతా. కచ్చితంగా అవ్వగలను. ఇలాంటి చావుతో నా ఉనికి మాసిపోనివ్వను. తరాలకు తరాలు ఉనికి నిలుపుకోవాలనుకుంటున్నాను. నన్నెవరూ ఆపలేరు. మళ్ళీ మొఱిగాడు. ‘భౌ భౌ భౌ…’
ఏదైనా రచన మనకు నచ్చడానికి రెండు కారణాలు ఉంటాయి. ఆ రచనలలోని సార్వజనీనత, ఆ రచన అందించే ఆలోచన, విజ్ఞానం, సంస్కారం – ఇది మొదటి కారణం. ఆ రచనలో మన ప్రతిబింబం కనిపించడం, అందులోని అనుభవాలూ అనుభూతులూ మనవి కూడా అవడం రెండో కారణం. ఈ ‘బ్రతుకాట’ను నేను అనువదించినవుడు ఈ రెండో తరహా అంశాలు ఎంతో తరచుగా తటస్థపడ్డాయి. నాలో అనునాదం కలిగించాయి.
1960 ఆరంభంలో, వేలూరిగారు ఆంధ్రవిశ్వవిద్యాలయంలో న్యూక్లియర్ ఫిజిక్స్ ఉన్నత విద్యార్థిగా ఉన్న రోజుల్లో ఆంధ్రవిశ్వవిద్యాలయ వేదికపై డిసెంబరు 14, 1960 నాడు సుమారు వెయ్యిమంది ప్రేక్షకుల ముందు ప్రదర్శించిన ఉత్సవం ఈ కావ్యదహనోత్సవం.
గతనెలలో ఈమాట యూట్యూబ్ ఛానెల్కు కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ
గుంటూరు జిల్లా రచయితల సంఘం సాహితీ పురస్కారాల కోసం కథ, కవితా సంపుటాలను ఆహ్వానిస్తున్నది.