ఈమాట » పాఠకుల అభిప్రాయాలు

Expand to right
Expand to left

పాఠకుల అభిప్రాయాలు


ఈ పదం(పదాలు) ఉన్న అభిప్రాయాలు చూపించండి

ఇప్పటిదాకా ఈమాట లో తెలియచేసిన అభిప్రాయాలు: 6430

1 2 3 4 5 ... 643 పాత అభిప్రాయాలు»

  1. హాబూ నిప్పు గురించి KMK Sastry అభిప్రాయం:

    05/16/2012 2:45 pm

    ఆ రాత్రి చెవులు బద్దలైపోయేంత గట్టిగా మెరుపు మెరిసింది?

    సరి చేసుకోగలరు.
    కోటేశ్వర శాస్త్రి.

    [కృతజ్ఞతలు - సం.]

  2. మల్లె అంటు గురించి జ్యోతిర్మయి అభిప్రాయం:

    05/15/2012 11:08 pm

    “ఎంతో దూరాన తాను వదిలేసిన తన వెచ్చని కుదురును
    పచ్చని బాల్యాన్ని తలుచుకుని చిన్నబోయిన మల్లె అంటు”

    ఈ వాక్యాలు చదివాక చిన్నబోయింది మల్లె అంటు మాత్రమే కాదులెండి… తడిపొడిగా తడిసిన జ్ఞాపకాలు కదిలాయి..

  3. తేనీటి సమయం గురించి జ్యోతిర్మయి అభిప్రాయం:

    05/15/2012 10:59 pm

    ఓ వారాంతపు ఉదయం.. అక్షర మాలల కూర్చిన పదచిత్రం.. బావుందండీ.

  4. ఆషాఢస్య ప్రథమ దివసే గురించి lyla yerneni అభిప్రాయం:

    05/12/2012 12:01 am

    సంస్కృత ఛందస్సు గురించిన ఒక ఆసక్తికరమైన పరిశోధనాపత్రం ఇది. - కామేశ్వరరావు

    చదివాను. నచ్చింది.
    లైలా.

  5. ఆషాఢస్య ప్రథమ దివసే గురించి lyla yerneni అభిప్రాయం:

    05/11/2012 11:45 pm

    “మేఘదూత కావ్య రచనకు కాళిదాసు ఎందుకు మందాక్రాంత వృత్తాన్ని ఎన్నుకొన్నాడు అనే ప్రశ్న మన కెదురవుతుంది. దుఃఖముతో బాధపడుతూ ఉండే మనిషి మాటలాడుతుంటే ఆ మాటలు ఆగి ఆగి ఆ వ్యక్తి నోటినుండి జారుతాయి, అవి విరామము లేకుండా ఏకధాటిన రావు.”

    It looks (at least for the duration of this essay.:-)) the essayist views Meghadutam primarily as a ‘viraha kavyam.’ And, Since he is thinking along those lines, he tries to attribute to the meter Mamdakramta, traits of -graveness, sadness.

    I do not buy into either premise.

    After reading all poems in Meghadutam, I do not think, over all, the poetry is about ‘viraham.’ I am not denying viraham’s presence in this writing. I am saying it is a smaller component of a bigger theme.

    Why should one ignore the recurring themes of cloud-earth, cloud-river. The cloud (who is continuously instructed by Yaksha himself, to be a ‘dakshina nayaka’ and enjoy himself, all the way.) - What about the mythical characters and lovely anecdotes about them, that come up in several Mandakranta poems and charm us.

    I really don’t think Kalidas has much interest to tell the readers, the story of Yaksha. Nor to make his grief the main focus of his writing. Did you look at the fastness with which he disposes off the outline of the story, in the very first poem. The poet could not wait to get out of it and get into the beautiful outdoors.
    Notice the poet did not even bother to complete Yaksha’s story, whether he is reunited with his beloved wife or not?:-)

    The Meghaduta kavyam is neither a Viraha kavyam nor a Samdesa kavyam, in the way the writer projects, in this essay. If there is a message in the kavyam, it is a bigger and broader message, and please! give me a break - it is not spiritual. :-) :-) in the sense, the Indian religious tend to use it. God! It is not Svami and Yogi spiritual. Kalidasa is more with clouds, daffodils, and woods, more with that Shelley, that Wordsworth, and that Frost here. The poetry is a Mapquest mapping of a scenic route -for the meandering, exploring, the nature loving, and erotic soul. People get on aeroplanes, get in cars, go trekking when they read stories and poetry such as this one.

    If one must catalogue :-) I would rather see the Meghadutam kavyam thrown under “Travel” section. Put it next to Peter Mayle’s book “A year in provence” - They will sit well together. And keep giving incredible happiness to millions of readers.

    లైలా

  6. ఆషాఢస్య ప్రథమ దివసే గురించి మోహన అభిప్రాయం:

    05/11/2012 11:09 am

    తఃతః గారు,

    రగడలు దేశి ఛందస్సు, అవి మొట్టమొదట రఘటాబంధమని నాగవర్మ ఛందోంబుధిలో పేర్కొన్నాడు. కన్నడములో వీటిని ఉత్సాహ (మూడు మాత్రలు), మందానిల (నాలుగు మాత్రలు), లలిత (ఐదు మాత్రలు) రగళె అంటారు. దాని సామాన్య లక్షణము -

    కం. గణనియమ విపర్యాసదొ-
    లేణెవడెదొళ్పెసెదు మాత్రె సమనాగె గుణా-
    గ్రణియ మతదింద తాళద
    గణనెగొడంబట్టు దదువె రఘటాబంధం (నాగవర్మ)

    ఇవి మాత్రాగణాలతో ఉంటాయి, ప్రతి పాదములో మాత్రల సంఖ్య సమానము, ఇది ద్విపద, ఇది తాళబద్ధమైనది. చివరి గుణము అంటే రగడ తాళబద్ధమైనదని చెప్పడము చాల ముఖ్యము. జయకీర్తి ఛందోనుశాసనములో ఇలాగంటాడు -

    స్వచ్ఛంద సంజ్ఞా రఘటా మాత్రాక్షర సమోదితా
    పాదద్వంద్వ సమాకీర్ణా సూశ్రావ్యా సైవ పద్ధతిః

    ఇది స్వచ్ఛందము, మాత్రాగణయుక్తము, ద్విపద, సుశ్రావ్యము, ఇది ఒక పద్ధతి. ఈ పద్ధతి పజ్ఝటికా (యశస్తిలక చంపువులో పజ్ఝటికా ఉన్నది) నుండి వచ్చినదని భావన. రగళెను (తెలుగులో రగడ) మొదట పంపకవి తన భారతములో ఉపయోగించాడు. కవిజనాశ్రయకర్త దీనిని ఉదహరించలేదు. అంటే తెలుగులో దీని వాడుక తరువాతి కాలములో. కానీ తెలుగులో రగడను పోలిన ఒక పురాతన శాసనము ఉన్నది. తెలుగులో తొమ్మిది రగడలు ఉన్నాయి. వృషభగతి రగడలాటి మిశ్రజాతి రగడ కన్నడములో లేదు, అది భామినీషట్పదిగా అందులో ఉన్నది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే రగడలకు ముఖ్యప్రాణము అవి మాత్రాబద్ధము, తాళబద్ధము. అందుకే తెలుగులో ఇవి యక్షగానాలలో, ఉదాహరణకావ్యములలోని కళికోత్కళికలలో, కావ్యాలలో కొన్ని వర్ణనలలో వాడబడ్డాయి. త్యాగరాజకీర్తనలు మున్నగు వాటిని పదాలను విరిచి పాడితే బాగుండడము లేదని తరచుగా వింటూ ఉంటాము. రగడలు కూడ పాడదగినవే. అందుకే వీటిని విరిచి వ్రాయడము బాగుండదనే నా భావన. ముఖ్యముగా రెండు నాలుగు మాత్రలను ఒక ఎనిమిది మాత్రలుగా (ఉదా. IIIUIII) వాడడము సరికాదనే నా అభిప్రాయము. కవులు నిరంకుశులు, ఎలాగైనా వ్రాసికోవచ్చు. కాని అవి అన్నీ సరి కావు. ఉదాహరణగా, పాల్కురికి కొన్ని సంస్కృత ద్విపదలలో, విశ్వనాథ ఒక తెలుగు ద్విపదలో పాదాంత యతిని పాటించలేదు. వారిద్దరూ మహాకవులే. అంత మాత్రాన వారి ఈ దోషాన్ని గుణముగా అంగీకరీంచకూడదు అనే నా ఉద్దేశము. ఇవి వారి కవిత్వపు వాసినిగాని, వారి విద్వత్తును గానీ అవమాన పరచడము కాదు. వైయక్తికముగా, నేను కవిని గాను, ఒక లాక్షణికుడు మాత్రమే. లక్షణాలను వివరించడానికి పద్యాలను ఉదాహరణలుగా వ్రాస్తాను. మహాకవులను ఎత్తి చూపే పాండిత్యము, కవిత్వము నాలో లేవు.

    విధేయుడు - మోహన

  7. మూడు లాంతర్లు -11 గురించి Madhav అభిప్రాయం:

    05/11/2012 10:59 am

    ప్రసాద్ గారూ,

    అ. బండరాళ్ళ ప్రదేశాల్లో ఉండేవాళ్ళకి కొన్ని రాళ్ళ మీద చట్టులా ఉండి, అందులో నీరు నిలవడమూ, ఆ నీటి కోసం కాకులు ఆ బండ మీద చేరడమూ ఒక దృశ్యానుభవం. లేదూ ఆ బండ ఒక బావి బండగా, ఆ చట్టు బిందెలు, కుండల ఒరిపిడి వల్ల వచ్చినదీ కావచ్చును. ఆ చట్టులో నీరెండిపోయినా కూడా కాకులు అలవాటుగా దాహమేసినప్పుడల్లా ఆవైపుకు రావడం, బండ మీద వాలడం, లేకపోతే ఒకసారి బండ చుట్టు తిరిగి వెళ్ళిపోవడం కూడా పరిచయమైన దృశ్యమే. ఇంకెక్కడా నీళ్ళు దొరకని కాకి నీరున్నా లేకపోయినా ఈ బండమీదే చివరికి వాలిపోతుంది. ఈ అనుభవం ఉన్న పాఠకుడికి బండమీద కాకులు చచ్చెను అన్న పాదం వేసవి గురించిన కవితలో అసహజంగా కనిపించదు సరికదా ఎంతో ఔచిత్యంగా కనిపిస్తుంది. అంతే కాకుండా, పాదభావాల పునరుక్తితో గతిని సాధిస్తున్న కవి, ఎండనూ చావునూ ఆ తర్వాత వచ్చే పాదాల్లో మళ్ళీ కలిపే వాడుకోవటం ద్వారా కవిత నిర్మాణంలో కూడా ఎంతో శ్రద్ధ చూపించాడని అనిపిస్తుంది. ఇందువల్ల కవిత్వానుభవపు లేమి కవి లోపం కాక, పాఠకుని వైయక్తిక పరిమితిగా కూడా పరిశీలించవచ్చునని నాకనిపిస్తున్నది (ప్రత్యేకించి, ఇతరత్రా పకడ్బందీగా ఉన్న కవితలో.)

    ఆ. ఇకపోతే, ఔచిత్య భంగానికి -

    లౌక్యంగా బయటి సామాజికులు - అంటే విమర్శకులు, పాఠకులు, సంపాదకులు వంటివాళ్ళను దృష్టిలో ఉంచుకొని శిల్పాన్ని పూర్తిచేసేడా లేక కేవలం తనకు చాల ఆంతరంగికమైనది, తనదైన సృజనానుభవానికే బద్ధుడై, దాన్నే మళ్ళీ మళ్ళీ తరచి చూసుకుంటూ చిత్రణ పూర్తిచేస్తున్నాడా, అసలు శ్రద్ధ పెట్టి పని పూర్తి చేసేడా లేదా అనేది పట్టి చూస్తే తెలిసిపోతుంది.

    - అన్న అభిప్రాయం పూర్తిగా సరి కాదని నాకనిపిస్తున్నది. బైటివారినెవరినో దృష్టిలో ఉంచుకొని సృజననీ, శిల్పాన్నీ ఎవరైనా ఎలా ప్రయత్నిస్తారు? (రిటైర్మెంట్ ఫంక్షన్‌లో అలవాటుగా ఇచ్చే గడియారపు ఫలకం మీద అచ్చేయడం కోసం మా బాబాయి చేత అందరూ రాయించుకునే పంచరత్నాలు అనే ఐదు వృత్త పద్యాలు మినహాయింపు, ఇందుకు.) ఈ కారణం వల్ల ఔచిత్య భంగం జరిగిందనే ఊహకు ఆధారమేమైనా ఉన్నదా?

    లౌకిక కల్మషంలేని సృజనలో కూడా ఔచిత్యభంగానికి, ఉద్వేగపులేమికి నాకు కనిపించిన రెండు కారణాలు.

    1. మీరు చెప్పినట్టు కాకుండా మొదట ఔద్వేగిక ప్రధానంగా, దాదాపు అప్రయత్నంగా వెలువడిన సృజనకు మెరుగులు చెక్కే పని అన్నది అసలు ఒకటుందనీ, అది చాలా శ్రద్ధతో చేయాలనీ తెలియకపోవడమే కాదు, అంతకు మించి ‘ఔద్వేగిక ప్రధానంగా దాదాపు అప్రయత్నంగా వెలువడినదే‘ నిజమైన కవిత్వమనీ, దానినేమాత్రం సవరించబోయినా, భావావేశం చచ్చిపోయి అది కవితే కాకుండా పోతుందనీ ఒక బలమైన అపోహ ఎంతోమందిలో (ఎంతో చదువుకున్న వారిలో కూడా) ఉండటం వల్లనే రచనలో అపరిపక్వత, దాని వల్ల ఔచిత్యభంగం కలుగుతున్నది. ఈ అపోహ మరీ అరుదైనది కాదని ఎక్కువ శ్రమపడకుండానే నిర్ధారించుకోవచ్చును.

    2. ‘బైటివారి కోసం’ శిల్పాన్ని పూర్తి చేయడం కంటే ‘బైటివారికి దూరంగా’ అనేది ఇంకో కారణం. …కేవలం తనకు చాల ఆంతరంగికమైనది, తనదైన సృజనానుభవానికే బద్ధుడై, దాన్నే మళ్ళీ మళ్ళీ తరచి చూసుకుంటూ చిత్రణ పూర్తిచేస్తున్న కవి, ఆ సృజనపై ఒక మూఢానురాగాన్ని పెంచుకోవడం ఇది. గుడ్డిప్రేమ అని అంటారే అలా, తన రచనలో (తనలో) లోపాన్ని తనే గమనించలేకపోవడమూ ఉన్నది. నాకు పుట్టి నేను పెంచిన బిడ్డ బాగోగులు నాకంటే బాగా ఇంకెవరికీ తెలియవు అని బలంగా నమ్మే ఒక తండ్రి లేదా తల్లి మనస్తత్వం ఇలాంటిదే. విమర్శలకు, సలహాలకు వెఱపు ఇందువల్లేనని నా అభిప్రాయం. దానివల్ల, తన రచనను తాననుకున్న విధంగా మాత్రమే కాకుండా ఇంకోరకంగా కూడా ముస్తాబు చేయడానికి, ఆ రచనలో తానుద్దేశిస్తున్న ఉద్వేగాన్ని ఔచిత్యాన్ని, తానూహించినదానికి భిన్నంగా, మరింత బలపర్చడానికి వెసులుబాటు ఉండవచ్చునని నమ్మలేక పోవడం వల్ల, ఎంతో శ్రద్ధ పెట్టి చిత్రణ పూర్తి చేస్తున్నా కూడా ఔచిత్యభంగం కలుగుతూనే ఉన్నది. ఈ ప్రవృత్తి అహం లానే పైకి కనిపించినా నిజానికి కాదు. అహం కూడా కొంతమందిలో ఒక కారణమైనా, అది లౌకిక తత్వ సంబంధి కాబట్టి అప్రస్తుతం.

    నాకు చాలా కాలం క్రితం సినిమాలకి ఎడిటర్, డైరెక్టర్ వేరే వేరే ఎలా ఉండగలరు, అని సందేహం పట్టి పీడిస్తుండేది. తీసే సినిమా మొత్తం (కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం) దర్శకుడి సృజన అయినప్పుడు, ఆ సృజనను ఎలా ఆవిష్కరించాలో, ఎలా సమర్పించాలో అతనికంటే ఎవరికి ఎక్కువ తెలుస్తుంది? అందువల్ల డైరక్టరే ఎడిటర్ కూడా కావాలి కదా. మరి అలాంటప్పుడు, వేరే వ్యక్తి ఎలా ఆ సినిమాను ఎడిట్ చేయగలడు? కానీ ఎంతోమంది గొప్ప దర్శకుల సినిమాలకు కూడా ఎడిటర్లున్నారు. తన సృజనకు (దీటైన భాగస్వామిగా) చక్కగా మెరుగు పెట్టగలడన్న నమ్మకం తన సాధ్యాసాధ్యాలను తెలుసుకున్న దర్శకుడికి ఉండటం వల్లనే కదా ఇది సాధ్యం; లేని పక్షంలో పైన చెప్పిన మూఢానురాగం ఇందుకు అడ్డుపడి ఉండేది. సృజనకు, ఆ సృజన మూలాన్ని తత్వాన్ని గుర్తించి చక్కగా ముస్తాబు చేసి సమర్పించడం అనే ప్రక్రియకు ఉన్న నాజూకైన తేడా గమనికకు రావడంతో ఆ సందేహం నాకు తీరిపోయింది.

    దిశానిర్దేశం చేయగలిగిన విమర్శకులు, పాఠకుల తోడ్పాటు లేకపోవడం అనే లోటుని కూడా నేను గమనించాను. ఉదాహరణకి, ఆదివారం మధ్యాహ్నం కవయిత్రికి మీలాంటివారు పరిచయమై ఉండి, (ఆమె కేవలం ఔద్వేగిక / అప్రయత్న కవి కాకపోయి ఉండి) మీ విమర్శ తోడ్పాటు ఆమెకు ఉండి ఉన్నట్టయితే, ఆ కవిత మరింత బలంగా ఉండేది కదా! అలా జరిగిందో లేదో (అంటే ఆ కవితను ముందుగానే చదివి ఆమెకు ఎవరైనా విమర్శ, సలహా ఇవ్వడం వంటివి) నాకు తెలియదు కాబట్టి, ఇది కేవలం ఒక ఉదాహరణగా మాత్రమే చెప్తున్నాను.

    మాధవ్

  8. ఆషాఢస్య ప్రథమ దివసే గురించి కామేశ్వరరావు అభిప్రాయం:

    05/11/2012 9:53 am

    సంస్కృత ఛందస్సు గురించిన ఒక ఆసక్తికరమైన పరిశోధనాపత్రం ఇది. మోహనగారీ వ్యాసంలో మందాక్రాంత ఛందస్సును గురించి చేసిన విశ్లేషణ వంటిదే ఈ పరిశోధనాపత్రంలో కూడా ఉంది. ఇందులో రచయిత ప్రతిపాదిస్తున్న కొన్ని విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఛందస్సు మీద ఆసక్తి ఉన్నవారికి (ముఖ్యంగా మోహనరావుగారికి!) యిది చాలా ఆసక్తికరమూ, ప్రయోజనకరమూ అవుతుందని భావిస్తున్నాను.

  9. ఆషాఢస్య ప్రథమ దివసే గురించి TahaTaha అభిప్రాయం:

    05/10/2012 9:13 pm

    మోహన గారికి నమస్కారాలు. గణాలకు తగ్గట్టుగా విరిచి రాయడమా రాయక పోవడమా అన్నది (ప్రతిభా వంతుడైన ) కవి ఇష్టం. ‘పీరులు’/ విమర్శకులు /అధ్యయనశీలురు, కవితా గుణావగుణాలను కాక ఛందస్సును మాత్రమే పరిశీలించటానికి పూనుకున్నప్పుడు ఆ పరిశీలనలో భాగంగా, ‘తెలుగులో సంస్కృత ఛందమయిన రగడను వాడినా కొన్ని చోట్ల గణాలకు తగ్గట్టుగా విరిచిరాయక పోవడం కూడా ఉంది’
    అని అనవచ్చేమో గానీ ‘పెద్ద లోటు’అన్న ఒక ‘విలువ’ ను ఆపాదించటం సబబేనా? ఇది ఛందానికి కూడా లోటు కాక పోవచ్చు దాన్ని తెలుగులో విరుపులు లేకుండా ఉపయోగించుకోవటంలో కవి కొన్ని కొత్త అందాలను కూడా తెచ్చిపెట్టి ఉండవచ్చు.

    మిత్రుడు
    తః తః

  10. ఆషాఢస్య ప్రథమ దివసే గురించి మోహన అభిప్రాయం:

    05/10/2012 2:13 pm

    రవి గారు,

    1) సంస్కృత కవులు ఒకే విధమయిన వృత్తముతో ఆశ్వాసాలను వ్రాసారు, తెలుగు కవులు ఎన్నో విధములయిన పద్యాలతో వ్రాసారు. రెండు భాషలలో మంచి కవులు తమ ధ్యేయాన్ని సాధించారు. ద్విపదలో వ్రాయబడిన ఏకాంతసేవ టాగూరు గీతాంజలికి సమానమైనది కాదా?
    2) నాలుగు ద్రావిడ భాషలలో తెలుగు తమిళ భాషలలో మాత్రమే అక్షరసామ్య యతి లేక వడి ఉన్నది. తమిళములో నియమాలు తెలుగులోలా అంత కఠినమయినవి కావు. ఉదాహరణ - వ, మ లకు యతి చెల్లుతుంది. బహుశా మామ, మావ వంటి పదాలు దీనికి కారణము కావచ్చును. కన్నడములో విరామయతిని కూడ యతిని పాటించరు.
    3) ద్రావిడ ఛందస్సులో ముఖ్యమైనది ద్వితీయాక్షర ప్రాస. ఇది అన్ని భాషలలో ఉన్నాయి, తెలుగులో మాత్రము ఉపజాతులలో యిది లేదు.
    4) తమిళములో, కన్నడములో దేశి ఛందస్సులో కావ్యాలనే వ్రాసినారు. షట్పదులలో, సాంగత్యములలో (సీసములో చివరి సూర్యగణము సాంగత్యములో లుప్తము) సంపూర్ణ కావ్యములు ఉన్నాయి కన్నడములో. ఇది ఎందుకు చెప్పుతున్నానంటే వీటిని పాడుకోవచ్చును. అంటే కన్నడములో, తమిళములో పాడుకోడానికి అనుకూలముగా కావ్యాలు ఉన్నాయి. కాని తెలుగులో యిట్టివి అరుదు. తెలుగు కావ్యాలు చదువుకోడానికి మాత్రమే వ్రాయబడ్డాయి. పాడుకోడానికి ప్రాస బాగుంటుంది.
    5) వేమన పద్యాలు అందముగా నుండడానికి కారణము పదాల విరుపు, అందరికీ అర్థమయ్యే భాష. పాదాంత యతి ఉపజాతులలో ఎప్పుడూ ఉంటుంది.
    6) యతి తద్దినము మాత్రము కాదు. తెలుగుతో కూడ అన్ని ద్రావిడ భాషలలో సామెతలు ఆదినుండి ఉన్నవి. అవి మన సంస్కృతికి ఒక కాణాచి. ఈ సామెతలలో అక్షరయతియో లేక ప్రాసయతియో ఎప్పుడూ ఉంటుంది. యతి, ప్రాసయతి వీటినుండి పుట్టాయని ఒక ఊహ. ఈ సామెతలపైన సురేశ్ గారి వ్యాసాన్ని ఎదురుచూస్తున్నాను :-)

    విధేయుడు - మోహన

1 2 3 4 5 ... 643 పాత అభిప్రాయాలు»