ఆంధ్రజ్యోతిలో మీ వ్యాసం చదివినా అక్కడ వ్యాఖ్య రాసే అవకాశం లేక అప్పుడు అసంతృప్తి చెందాను. ఇప్పుడు మళ్ళీ మీ వ్యాసం శ్రద్ధగా చదివేను. అద్భుతం. ద్రౌపది నవల గురించి జరుగుతున్న చర్చల పరంపరలో నాకు అమితంగా నచ్చిన వ్యాసం ఇదే.
రాజశేఖర్ గారూ,
పైనుదాహరించిన పద్యం రాయప్రోలు సుబ్బారావుగారి “ఆఁద్రావళి” ఖండకావ్యంలో “తెనుగు మాన్యము” అనే శీర్షిక లోనిది. ఐతే, పైన వ్రాసిన తీరులో వ్రాత దోషాలున్నాయి. “పాలక్రొమ్మీగడల్”, “కమ్మని మకరందకణములు” అని మొదటి రెండు చరణాలల్లో ఉండాలి. అందులోదే మఱొక పద్యం:\
ఇట్టివే ఇన్నో చక్కని పద్యాలు “ఆంద్రావళి”లోనున్నవి. వీలైన ఆ పుస్తకాన్ని సంపాదించి అందులో మీకు నచ్చిన పద్యాన్ని ఎన్నుకొనండి. నా దగ్గర 1972లో ఎమెస్కో వారు ప్రచురించిన ఈ పుస్తకం ప్రతి ఉన్నది.
నేను ద్రొపది నవలని గురిచి మట్లాడటమ్ లేదు. మాట్లాడే ఆసక్థి కూడా లేదు. ఎదుకో ఒక కారణమ్ చెప్తాను. తెలుగులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు ఒక చవకబారు వ్యవహారమ్ గా మారిపోయేయి ఎప్పటినుంచో!! సాజహిత్య అకాడెమీ ఇచ్చిన బహుమతులలో ఎక్కువ శాతం నాసిరకం కవి రచయితలకి రావడాన్ని గమనించండి! కాళీపట్నం రామారావు గారిలాంటివాళ్ళకి మరి ఇవ్వక పోతే పరువు పోతుందని అనుకున్నాకా లేటు గా ఇచ్చారు. అదే ఒక్కోసారి వాళ్ళు అవార్డ్స్ ఇచ్చిన వాళ్ళ పేర్లు గమనించి చూస్తే అసలు ఇలాంటి వాళ్ళకి అవార్డ్స్ ఎలా ఇచ్చారన్న సందేహం ఎవరికైనా వస్తుంది. తెలుగులో కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతులకీ ..అవార్డ్స్ కమిటీ వాళ్ళ సంకుచిత దృష్టీ ..ఆశ్రిత పక్షపాత వైఖరీ కారణాలుగా స్పష్టంగా తెలిసిపోతూ ఉంటుంది.
ఇలాంటి పరిస్థితి బెంగాల్ , కేరళ్ ఇంకా మరాటీ చివరికి అస్సామీ వంటి భాషల్లో కనిపించదు. ఎందుకంటే అక్కడ అవకతవకలు జరిగితే మీడియాలో ఏకిపడేస్తారు. కానీ అదే మన భాషలో ఇదేమిటి అని అడిగిన సందర్భమ్ ఒక్కటి కనిపించదు. మంచి రచయితలకి చాలామందికి బహుమతులు రాకపోవడమూ..అదే మీడియోకర్ కవి రచయితలకి లాబీయింగ్ చేసుకోవడం వల్ల మాత్రమే అవార్డ్స్ రావడమూ సర్వ సాధారణమైపోయింది.
ఆధునిక కవిత్వం గురించి ఓనామ రాని ఒక భాషా శాస్త్రజ్ఞుడో..కల్పన గురించి కనీసంగా తెలియని మరొక యూనివర్సిటీ ప్రబుద్ధుడో అక్కడ ఏళ్ల తరబడి తిష్ట వేసుకుని కూర్చుని సాహిత్య రాజకీయాలు నడుపుతూ తమతమ కుర్చీలు ఎలా కాపాడుకోవాలా అని అన్నిరకాల కుయుక్తులు చేస్తుంటారు. ఇది బహిరంగ రహస్యం. ఢిల్లీ లో ఉన్న వాళ్ళకి కూడా వీళ్ళగురించి తెలుసు. తెలుగు వాళ్ళు నిలదీసి అడగందే మేమేం చేయగలం అంటారు వాళ్ళు. ఒక జాతి గౌరవాన్ని తమతమ చిన్నపాటి బుధ్ధులతో ప్రతీసారీ రచ్చకీడుస్తున్న కమిటీలని ముందు ప్రశ్నించే వీలుండాలి.లాబీలు చేసుకుంటేనే బహుమతులు వస్తాయి మీకు అన్న ఒక అప్రకిటిత విధానం తెలుగున స్థిరపడేలా చేసేరు. బయటికి చూడడానికి ప్రజాస్వామ్య పంథాలో నడుస్తున్నట్టు ఒక ముసుగు ఉంటుంది. కానీ అదంతా బూటకమేనన్నది అందరూ ఎరిగిన సంగతి! ! unfortunately we are celebrating mediocrity.
మొదటగా ఈమాట కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు…
తెలుగు భాష మీద మమకారం ఉండడం వేరు… సామాన్య శాస్త్రాన్ని కూడా తెలుగు లో వివరించడడం నేను మొట్టమొదటి సరిగా చూస్తున్నాను. నాకు తెలిసి ఇంత ఓపిక, ఇంత బాష పైన మరియు విషయం పైన పట్టు ఉన్న వారు లోకంలో చాలా అరుదు. ఈ వ్యాసాల్ని పదిమందికి పంచాలని ఆశపడుతున్నాను. దయచేసి మీ అనుమతితో మా వెబ్ సైట్ లో మరియు నా బ్లాగ్ లో మీ వ్యాసాల్ని ప్రచురించాలని అనుకుంటున్నాను.
మీ అనుమతి కోసం వేచి చూస్తూ,
రామా మాదారపు
[మీ అభిమానానికి కృతజ్ఞతలు. పూర్తి నిడివి వ్యాసాన్ని మళ్ళీ మీ వెబ్సైట్లో ప్రచురించుకోడానికి ఈమాట నిబంధనలు ఒప్పుకోవు. వ్యాసం నుంచి రెండు, మూడు పేరాలు ఉటంకించి, పూర్తి పాఠం కోసం ఈమాటలో వ్యాసానికి లింక్ ఇవ్వగలరు. - సం.]
బృందావనరావు గారూ!! జాషువా గారి మీద ” మార్గమూ-మార్గణమూ” అన్న సాహిత్య వ్యాసాల సంకలనంలో జయప్రభ గారు విశ్లేషణాత్మకమైన వ్యాసం రాసేరు. మీరు దాన్ని చదివినట్టులేదు. అది అందరూ తప్పక చదవవలసిన విశ్లేషణ. అటువంటి వ్యాసాలని ఈమాట వాళ్ళు మరోసారి పరిచయడం చేయడం వలన కూడా మరి నలుగురికి తెలిసే అవకాశం వుంది.
మీ పత్రికలోని సాహిత్యాభిప్రాయాల లో ఇటీవలి సాహిత్య విమర్శలని ఎవరూ చదివినట్టుగా అన్పించని ధోరణులు తరుచూ కనిపిస్తాయి. అందువలన నలుగురికీ తెలిసేందుకు వీలుగా ఈ సమాచారాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాను. ఆసక్తి ఉన్నవారు ఆ పుస్తకాన్ని చదవగలరు. ఆమె గుర్రం జాషువా గారిని గురించి రాసిన వ్యాసం ఇదివరకటి ఏ విమర్శకులూ స్పృశించని కోణాలని చర్చించడం విశేషం!!
విశ్వనాథవారు “వేదహరిశ్చంద్రము” “కావ్యహరిశ్చంద్రము” అనే నాటకములు వ్రాశారు.
ఈ హరిశ్చంద్రునికథకూ ఆంధ్రులకూ కొంత సంబంధం ఉంది.
విశ్వనాథవారి “పురాణవైరగ్రంథమాల” ఉపోద్ఘాతములో ప్రశంసింపబడిన కోట వెంకటాచలముగారు “ఆంధ్రులెవరు” అనే గ్రంథాన్ని 1949లో ప్రచురించారు. http://www.new.dli.ernet.in/ లో “andhrulevaru” చదువుకోవచ్చు.
“నేను హరిశ్చంద్ర రంగస్థల పద్య నాటకాన్ని కనీసం ఇరవైసార్లు చూసి వుంటాను. తిరుపతి వెంకట కవుల పాండవోద్యోగ విజయాలతో సమానంగా ప్రజాదరణ పొందిన నాటకం హరిశ్చంద్ర.”-
చీమలమర్రి బృందావనరావు
శ్రీనాథుని “శృంగార నైషధము” కు (emesco classics) పీఠిక రాస్తూ - “ఒక రామాయణ కథ, ఒక పాండవుల కథ, బహు ప్రసిద్ధి కల కథలు. ఒక హరిశ్చంద్ర కథ, ఈ నల చరిత్రము రెండు నించుమించుగా రామాయణ కథ, ప్రధాన భారత కథ -ఎంత ప్రశస్తి కలవో అంత ప్రశస్తి కల కథలు.” అన్నారు విశ్వనాథ .
“హరిశ్చంద్ర కథ యున్నది. ఈ కథ వేదములో ఉన్నది. పురాణములలో నెక్కువ కనిపించదు. వేదములో నున్న హరిశ్చంద్ర కథకు, లోకములో ప్రసిద్థి పొందిన హరిశంద్ర కథకు సంబంధము లేదు.” - అనీ చెప్పారు.
హరిశ్చంద్ర కథ ఏ వేదములో ఉన్నది. ఎలా మార్చబడినదీ - ఈ విషయాలను గూర్చి తెలియ చెప్పగలరా.
ద్రౌపది నవలపై మరోకోణం నుంచి…. గురించి nagamurali అభిప్రాయం:
03/15/2010 12:44 pm
ఆంధ్రజ్యోతిలో మీ వ్యాసం చదివినా అక్కడ వ్యాఖ్య రాసే అవకాశం లేక అప్పుడు అసంతృప్తి చెందాను. ఇప్పుడు మళ్ళీ మీ వ్యాసం శ్రద్ధగా చదివేను. అద్భుతం. ద్రౌపది నవల గురించి జరుగుతున్న చర్చల పరంపరలో నాకు అమితంగా నచ్చిన వ్యాసం ఇదే.
పెదవి దాటనివి గురించి గోపాల్ కోడూరి అభిప్రాయం:
03/12/2010 12:22 pm
కథ చాలా సహజంగా ఉంది… చాలా బావుంది!
ఓహో యాత్రికుడా.. గురించి Rohiniprasad అభిప్రాయం:
03/12/2010 8:09 am
రాజేశ్వరరావు, హనుమంతరావుల గురించిన కొండలరావుగారి వ్యాసం ఆసక్తికరంగా ఉంది.
తెలగాణెము గురించి ధేశికాచారి అభిప్రాయం:
03/12/2010 12:37 am
రాజశేఖర్ గారూ,
పైనుదాహరించిన పద్యం రాయప్రోలు సుబ్బారావుగారి “ఆఁద్రావళి” ఖండకావ్యంలో “తెనుగు మాన్యము” అనే శీర్షిక లోనిది. ఐతే, పైన వ్రాసిన తీరులో వ్రాత దోషాలున్నాయి. “పాలక్రొమ్మీగడల్”, “కమ్మని మకరందకణములు” అని మొదటి రెండు చరణాలల్లో ఉండాలి. అందులోదే మఱొక పద్యం:\
వంశిన్ వంచి, మృణాళమున్ మెలిచి, పక్వద్రాక్ష నెండించి, వా
గంశల్ మార్దవమాధురీ సుభగ విన్యాసంబు జిల్కన్, దశ
త్రింశల్లక్షణ జనప్రసన్న రసనా దేవాలయాభ్యంతర
ప్రాంశు ప్రార్థనగీతమైన తెనుగుం బల్కున్ ప్రశంసించెదన్.
ఇట్టివే ఇన్నో చక్కని పద్యాలు “ఆంద్రావళి”లోనున్నవి. వీలైన ఆ పుస్తకాన్ని సంపాదించి అందులో మీకు నచ్చిన పద్యాన్ని ఎన్నుకొనండి. నా దగ్గర 1972లో ఎమెస్కో వారు ప్రచురించిన ఈ పుస్తకం ప్రతి ఉన్నది.
ద్రౌపది నవలపై మరోకోణం నుంచి…. గురించి rama bharadwaj అభిప్రాయం:
03/11/2010 2:47 pm
నేను ద్రొపది నవలని గురిచి మట్లాడటమ్ లేదు. మాట్లాడే ఆసక్థి కూడా లేదు. ఎదుకో ఒక కారణమ్ చెప్తాను. తెలుగులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు ఒక చవకబారు వ్యవహారమ్ గా మారిపోయేయి ఎప్పటినుంచో!! సాజహిత్య అకాడెమీ ఇచ్చిన బహుమతులలో ఎక్కువ శాతం నాసిరకం కవి రచయితలకి రావడాన్ని గమనించండి! కాళీపట్నం రామారావు గారిలాంటివాళ్ళకి మరి ఇవ్వక పోతే పరువు పోతుందని అనుకున్నాకా లేటు గా ఇచ్చారు. అదే ఒక్కోసారి వాళ్ళు అవార్డ్స్ ఇచ్చిన వాళ్ళ పేర్లు గమనించి చూస్తే అసలు ఇలాంటి వాళ్ళకి అవార్డ్స్ ఎలా ఇచ్చారన్న సందేహం ఎవరికైనా వస్తుంది. తెలుగులో కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతులకీ ..అవార్డ్స్ కమిటీ వాళ్ళ సంకుచిత దృష్టీ ..ఆశ్రిత పక్షపాత వైఖరీ కారణాలుగా స్పష్టంగా తెలిసిపోతూ ఉంటుంది.
ఇలాంటి పరిస్థితి బెంగాల్ , కేరళ్ ఇంకా మరాటీ చివరికి అస్సామీ వంటి భాషల్లో కనిపించదు. ఎందుకంటే అక్కడ అవకతవకలు జరిగితే మీడియాలో ఏకిపడేస్తారు. కానీ అదే మన భాషలో ఇదేమిటి అని అడిగిన సందర్భమ్ ఒక్కటి కనిపించదు. మంచి రచయితలకి చాలామందికి బహుమతులు రాకపోవడమూ..అదే మీడియోకర్ కవి రచయితలకి లాబీయింగ్ చేసుకోవడం వల్ల మాత్రమే అవార్డ్స్ రావడమూ సర్వ సాధారణమైపోయింది.
ఆధునిక కవిత్వం గురించి ఓనామ రాని ఒక భాషా శాస్త్రజ్ఞుడో..కల్పన గురించి కనీసంగా తెలియని మరొక యూనివర్సిటీ ప్రబుద్ధుడో అక్కడ ఏళ్ల తరబడి తిష్ట వేసుకుని కూర్చుని సాహిత్య రాజకీయాలు నడుపుతూ తమతమ కుర్చీలు ఎలా కాపాడుకోవాలా అని అన్నిరకాల కుయుక్తులు చేస్తుంటారు. ఇది బహిరంగ రహస్యం. ఢిల్లీ లో ఉన్న వాళ్ళకి కూడా వీళ్ళగురించి తెలుసు. తెలుగు వాళ్ళు నిలదీసి అడగందే మేమేం చేయగలం అంటారు వాళ్ళు. ఒక జాతి గౌరవాన్ని తమతమ చిన్నపాటి బుధ్ధులతో ప్రతీసారీ రచ్చకీడుస్తున్న కమిటీలని ముందు ప్రశ్నించే వీలుండాలి.లాబీలు చేసుకుంటేనే బహుమతులు వస్తాయి మీకు అన్న ఒక అప్రకిటిత విధానం తెలుగున స్థిరపడేలా చేసేరు. బయటికి చూడడానికి ప్రజాస్వామ్య పంథాలో నడుస్తున్నట్టు ఒక ముసుగు ఉంటుంది. కానీ అదంతా బూటకమేనన్నది అందరూ ఎరిగిన సంగతి! ! unfortunately we are celebrating mediocrity.
రమ.
About eemaata గురించి Rama Madarapu అభిప్రాయం:
03/11/2010 9:54 am
మొదటగా ఈమాట కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు…
తెలుగు భాష మీద మమకారం ఉండడం వేరు… సామాన్య శాస్త్రాన్ని కూడా తెలుగు లో వివరించడడం నేను మొట్టమొదటి సరిగా చూస్తున్నాను. నాకు తెలిసి ఇంత ఓపిక, ఇంత బాష పైన మరియు విషయం పైన పట్టు ఉన్న వారు లోకంలో చాలా అరుదు. ఈ వ్యాసాల్ని పదిమందికి పంచాలని ఆశపడుతున్నాను. దయచేసి మీ అనుమతితో మా వెబ్ సైట్ లో మరియు నా బ్లాగ్ లో మీ వ్యాసాల్ని ప్రచురించాలని అనుకుంటున్నాను.
మీ అనుమతి కోసం వేచి చూస్తూ,
రామా మాదారపు
[మీ అభిమానానికి కృతజ్ఞతలు. పూర్తి నిడివి వ్యాసాన్ని మళ్ళీ మీ వెబ్సైట్లో ప్రచురించుకోడానికి ఈమాట నిబంధనలు ఒప్పుకోవు. వ్యాసం నుంచి రెండు, మూడు పేరాలు ఉటంకించి, పూర్తి పాఠం కోసం ఈమాటలో వ్యాసానికి లింక్ ఇవ్వగలరు. - సం.]
నాకు నచ్చిన పద్యం - హరిశ్చంద్ర కాటి సీను గురించి rama bharadwaj అభిప్రాయం:
03/11/2010 7:40 am
బృందావనరావు గారూ!! జాషువా గారి మీద ” మార్గమూ-మార్గణమూ” అన్న సాహిత్య వ్యాసాల సంకలనంలో జయప్రభ గారు విశ్లేషణాత్మకమైన వ్యాసం రాసేరు. మీరు దాన్ని చదివినట్టులేదు. అది అందరూ తప్పక చదవవలసిన విశ్లేషణ. అటువంటి వ్యాసాలని ఈమాట వాళ్ళు మరోసారి పరిచయడం చేయడం వలన కూడా మరి నలుగురికి తెలిసే అవకాశం వుంది.
మీ పత్రికలోని సాహిత్యాభిప్రాయాల లో ఇటీవలి సాహిత్య విమర్శలని ఎవరూ చదివినట్టుగా అన్పించని ధోరణులు తరుచూ కనిపిస్తాయి. అందువలన నలుగురికీ తెలిసేందుకు వీలుగా ఈ సమాచారాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాను. ఆసక్తి ఉన్నవారు ఆ పుస్తకాన్ని చదవగలరు. ఆమె గుర్రం జాషువా గారిని గురించి రాసిన వ్యాసం ఇదివరకటి ఏ విమర్శకులూ స్పృశించని కోణాలని చర్చించడం విశేషం!!
రమ.
ద్రౌపది నవలపై మరోకోణం నుంచి…. గురించి damodara అభిప్రాయం:
03/11/2010 5:46 am
మీ వివరణ వ్యాసం చాలా బాగున్నది. ఈ నవలను ఎంపిక చెసిన త్రిమూర్తులకు ఒక చురక. వారు తప్పక జాతికి క్షమాపణ చెప్పలి. వివరణ ఇవ్వాలి.
నాకు నచ్చిన పద్యం - హరిశ్చంద్ర కాటి సీను గురించి Vadapalli SeshatalpaSayee అభిప్రాయం:
03/11/2010 5:43 am
ఋగ్వేద - ఐతరేయ బ్రాహ్మణములో.
విశ్వనాథవారు “వేదహరిశ్చంద్రము” “కావ్యహరిశ్చంద్రము” అనే నాటకములు వ్రాశారు.
ఈ హరిశ్చంద్రునికథకూ ఆంధ్రులకూ కొంత సంబంధం ఉంది.
విశ్వనాథవారి “పురాణవైరగ్రంథమాల” ఉపోద్ఘాతములో ప్రశంసింపబడిన కోట వెంకటాచలముగారు “ఆంధ్రులెవరు” అనే గ్రంథాన్ని 1949లో ప్రచురించారు.
http://www.new.dli.ernet.in/ లో “andhrulevaru” చదువుకోవచ్చు.
–
“కాటిసీను”ను ఇక్కడ చదువుకోవచ్చు.
జాషువాగారి ఖండకావ్యము “శ్మశానవాటి” పద్యాలు ఇక్కడ చదుకోవచ్చు.
విధేయుడు,
వాడపల్లి శేషతల్పశాయి.
నాకు నచ్చిన పద్యం - హరిశ్చంద్ర కాటి సీను గురించి lyla yerneni అభిప్రాయం:
03/10/2010 2:37 pm
“నేను హరిశ్చంద్ర రంగస్థల పద్య నాటకాన్ని కనీసం ఇరవైసార్లు చూసి వుంటాను. తిరుపతి వెంకట కవుల పాండవోద్యోగ విజయాలతో సమానంగా ప్రజాదరణ పొందిన నాటకం హరిశ్చంద్ర.”-
చీమలమర్రి బృందావనరావు
శ్రీనాథుని “శృంగార నైషధము” కు (emesco classics) పీఠిక రాస్తూ - “ఒక రామాయణ కథ, ఒక పాండవుల కథ, బహు ప్రసిద్ధి కల కథలు. ఒక హరిశ్చంద్ర కథ, ఈ నల చరిత్రము రెండు నించుమించుగా రామాయణ కథ, ప్రధాన భారత కథ -ఎంత ప్రశస్తి కలవో అంత ప్రశస్తి కల కథలు.” అన్నారు విశ్వనాథ .
“హరిశ్చంద్ర కథ యున్నది. ఈ కథ వేదములో ఉన్నది. పురాణములలో నెక్కువ కనిపించదు. వేదములో నున్న హరిశ్చంద్ర కథకు, లోకములో ప్రసిద్థి పొందిన హరిశంద్ర కథకు సంబంధము లేదు.” - అనీ చెప్పారు.
హరిశ్చంద్ర కథ ఏ వేదములో ఉన్నది. ఎలా మార్చబడినదీ - ఈ విషయాలను గూర్చి తెలియ చెప్పగలరా.
Thanks
lyla