రంగులు
వరిచేలు పచ్చగా లేవు
మట్టి దిబ్బలు ఎర్రగా లేవు
ప్రకృతి రంగులన్నిటినీ
దోచేసుకుని రాత్రి
ఎటో పారిపోతోంది
తూరుపు కొండ చాటున
మాటు వేసిన సూర్యుడు
రాత్రి మీద దాడిచేసి
వేటి రంగుల్ని తిరిగి
వాటికే ప్రసాదించాడు
గడ్డిపరక మీద
రెండు కన్నీటి బొట్లు విడిచి
రాత్రి మాయమైంది!

రచయిత మూలా సుబ్రహ్మణ్యం గురించి: ఐదేళ్ళ క్రితం కవిత్వం రాయడం ప్రారంభించి, యాభైకి పైగా కవితలు, పది కథలు, మరికొన్ని వ్యాసాలురాసారు. "ఏటి ఒడ్డున " అనే కవితా సంకలనం ప్రచురించారు. ... పూర్తిగా »
radhika అభిప్రాయం:
January 3, 2008 12:16 pm
చాలా బాగుందండి
కృష్ణ అభిప్రాయం:
January 3, 2008 3:08 pm
బాగుంది. ఇదీ కవిత్వమంటే. కొత్త ఆవకాయ ఘుమఘుమలు బాగున్నాయి. ఇంత తక్కువే పెట్టారే? నిజంగా కొత్తదనమున్న కవిత.
teresa అభిప్రాయం:
January 5, 2008 6:55 am
ఈ ఆవకాయ తక్కువ పెట్టినా చాలా బావుందండీ. మళ్ళీ మళ్ళీ తినాలన్పించేలా1
Sowmya అభిప్రాయం:
January 30, 2008 6:48 am
బాగుందండీ… ఇదే భావం మరెక్కడో చదివినట్లు గుర్తు నాకు. కానీ…. అది పక్కన పెట్టేస్తే…
“గడ్డిపరక మీద
రెండు కన్నీటి బొట్లు విడిచి
రాత్రి మాయమైంది!”
- బాగుంది చాలా….
తెలుగు అభిమాని అభిప్రాయం:
February 22, 2008 9:34 am
బాగుంది. చక్కటి కవిత్వం.