కన్యాశుల్కం మళ్ళీ ఎందుకు చదవాలంటే …
6.
ఏది ఎలావున్నా, పాక్షిక దృష్టి పక్కకునెట్టి, నారాయణరావు అనువాదం, వెనుకమాటలు చదివినతరువాత, మళ్ళీ తెలుగు కన్యాశుల్కం చదివి, వేరే కోణంనుంచి ఆ నాటకాన్ని అర్థం చేసుకోవడం అవసరమేనని అనిపిస్తుంది.
ఈ వ్యాసం రాయడానికి ఉపయోగపడిన పుస్త కాలు:
- మన గురజాడ — శ్రీశ్రీ (శ్రీశ్రీ సాహిత్య సర్వస్వం -9 : కూర్పు చలసాని ప్రసాద్, 1988)
- మళ్ళీ కన్యాశుల్కం గురించి — కేతవరపు రామకోటి శాస్త్రి (1992)
- కన్యాశుల్క నాటక కళ — సర్దేశాయి తిరుమల రావు (1994)
- కన్యాశుల్కం — నూరేళ్ళ సమాలోచనం — సంపాదకులు : మొదలి నాగభూషణ శర్మ, ఏటుకూరి ప్రసాద్ (1999)
- మహోదయం — కె. వి. రమణా రెడ్డి (1958)
- కన్యాశుల్కం, మరోవైపు — కోవెల సంపత్కుమారాచార్య (2000)
- గురజాడ రచనలు - కవితల సంపుటం, సెట్టి ఈశ్వర రావు, పరిష్కర్త (1984)
- అబ్బూరి సంస్మరణ — నాట్య గోష్టి ప్రచురణ (1988)
- కన్యాశుల్కం - సామాజిక సంబంధాలు, కాత్యాయనీ విద్మహే (2005)
- కన్యాశుల్కం , టీకాటిప్పణి , కె.వి. రమణారెడ్డి (1991)
- నాయెఱుక , ఆదిభట్ల నారాయణ దాసు స్వీయ చరిత్ర (1976)
- కన్యాశుల్కం, గురజాడ ( జయంతి పబ్లికేషన్, 1983)
- గురజాడ అప్పారావు - కన్యాశుల్కము, కుదింపు కూర్పు, నార్ల వెంకటేశ్వర రావు (1976)
- సారస్వత వివేచన — రాచమల్లు రామచంద్రా రెడ్డి (1976)
[కన్యాశుల్కం నాటకం పై గత 50 సంవత్సరాలుగా వచ్చిన పొగడ్తలు, విమర్శలు, ప్రతివిమర్శల నుండి పాఠకులకు పనికివచ్చే కొటేషన్లు ఈ అనుబంధంలో నేను పొందుపరచాను. — రచయిత]
Rohiniprasad అభిప్రాయం:
September 4, 2007 10:30 am
కన్యాశుల్కం గురించి ఎందరో ఎన్నో రకాల విశ్లేషణలు చేశారు, చేస్తున్నారు. రచయితగా, నాటకకర్తగా ఎంతో ప్రతిభావంతుడైన అప్పారావుగారు ఈ నాటకం చదువుతున్నప్పుడు మనకు సంఘసంస్కర్త రూపంలో కాక తీవ్రమైన విమర్శకుడుగానూ, వ్యాఖ్యాతగానూ కనిపిస్తాడు. ఆయన విమర్శించిన విషయాల్లో సంఘ దురాచారాలూ ఉన్నాయి; సంఘసంస్కర్తలుగా చలామణీ అవుతూ పబ్బం గడుపుకునే దగాకోర్ల వ్యవహారాలూ ఉన్నాయి.
ఈ రోజుల్లో అనాథాశ్రమాలు నిర్మించి డబ్బులు దండుకునేవాళ్ళున్నట్టే ఆ రోజుల్లోనే వీరేశలింగంగారు సదుద్దేశంతో తలపెట్టిన మంచి పనులను దుర్వినియోగం చేసుకునేవారూ ఉండేవారనే సంగతి ఈ నాటకంవల్ల మనకు తెలుస్తుంది. ఎటొచ్చీ ఇటువంటి ఆషాఢభూతుల వల్ల కలిగే హానికన్నా సంఘంలో ప్రవర్తిల్లుతూ ఉండిన దురాచారాలు ఎక్కువ ప్రమాదకరం కనకనే కన్యాశుల్కం నాటకాన్ని వాటిని ఎత్తిచూపినదిగా అందరూ గుర్తించారు.
నాటకమంతా డామినేట్ చేసిన గిరీశం కుయుక్తులను ఎవరూ మిస్ అవరు. సంఘసేవను తప్పుదోవ పట్టించ ప్రయత్నించినవాడుగా అతను కనబడుతూనే ఉంటాడు. అయితే అతని వ్యక్తిగత దోషాలూ, బలహీనతలూ సంఘ దురాచారాలంత తీవ్రమైనవిగా అనిపించవు. అందుకే మనం అగ్నిహోత్రావధానులు, లుబ్ధావుధాన్లు, రామప్ప పంతులు తదితరుల వైఖరిని ఎంతో గర్హనీయంగా పరిగణిస్తాం. గిరీశాన్ని చూసినప్పుడు మాత్రం ‘బాగా అయింది శాస్తి’ అని నవ్వుకుంటాం. పై వర్గంతో పోలిస్తే గిరీశం అంతటి దుర్మార్గుడుగా మనకు అనిపించడు. పైగా నాటకంలో గిరీశం ఒక్కడే ఆధునికుడు. అయితే ఆధునికతలోని ఇతర లక్షణాలతో బాటు దాని అవలక్షణాలూ అతనిలో ఉంటాయి. పాతుకుపోయిన దురాచారాలకు ప్రతీకలు వారైతే వారి అవివేకాన్ని ఆసరాగా చేసుకుని లాభం పొందేవారికి ప్రతీక గిరీశం.
మొత్తం మీద అన్నీ వాస్తవికత ఉట్టిపడే పాత్రలే. సజీవమైనవే. అందుకే కన్యాశుల్కం అందరికీ ప్రీతిపాత్రమైంది. మార్క్సిస్టులు కనాశుల్కాన్ని హైజాక్ చేశారని నేననుకోను. (వారికి నచ్చింది కదా అని దాన్ని మరికాస్త అనుమానంతో చూడాలనీ అనుకోను). ఎవరికి నచ్చిన అంశాలను వారు మెచ్చుకుంటారు. ఈ నాటకానికి వీరాభిమానుల్లో శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, భమిడిపాటి కామేశ్వరరావు వంటి ఉద్దండులుండేవారు. మనకన్నా అప్పటి పరిస్థితులు వారి తరంవారికి మరింత బాగా తెలుసు. తక్కినవన్నీ పక్కన పెట్టినా కేవలం భాష, యాసల విషయంలో కూడా చాలామందికి అదెంతో ఆహ్లాదకరమైన రచన.
అప్పటి సామాజిక సమస్యలు ఈనాడు లేకపోవచ్చు. ఇప్పటికీ మనలో ఎందరిలో అగ్నిహోత్రావధానులు, లుబ్ధావుధాన్లు, రామప్ప పంతుళ్ళు, లేదా వారి లక్షణాలు, కనబడుతున్నాయనేదే ముఖ్యం. అందువల్లనే ఈనాటికీ కన్యాశుల్కం రెలెవెంట్ గా అనిపిస్తుంది.
Kameswara Rao అభిప్రాయం:
September 11, 2007 7:56 am
న్యాయంగా, వేల్చేరు వారి పుస్తకం చదవకుండా నేనేమీ comment చెయ్యకూడదు. కానీ ఈ సమీక్షలోని కొన్ని విషయాలు ఆసక్తిని కలిగించడం వల్ల ఇది రాస్తున్నాను.
“ఈ దృష్టితో చదివితే ఒక అంచెలో ( ఈ నాటకాన్ని వేరువేరు అంచెల్లో వ్యాఖ్యానించడానికి తావుంది) వచ్చే ఊహ: మధురవాణి గొంతుతో కందుకూరి వీరేశలింగం పంతులు గారిని, ఆయన చేపట్టిన వేశ్యా సంస్కరణోద్యమాన్నీ వేళాకోళం చేస్తున్నట్టు కనిపిస్తుంది. విషయమేమిటంటే, నాటక రచయిత ముఖ్యోద్దేశం సంఘ సంస్కరణ కాదు ;”
ఇది వేల్చేరువారి ఊహో వేలూరివారి ఊహో తెలియదుకాని వీరేశలింగాన్ని వేళాకోళం చెయ్యడంగా ఊహించడం కొంత అతిశయంగా తోస్తోంది. గురజాడకి కందుకూరి మీద గౌరవం ఉందన్న విషయం అతని డైరీలూ, ఉత్తరాలూ చదివితే తెలుసే విషయమే. అందుచేత అతన్ని వేళాకోళం చేసేడని నేననుకోను. అతను చేపట్టిన సంఘ సంస్కరణలోని పరిమితులని వ్యంగ్యంగా సూచించేడని మాత్రమే చెప్పగలం. అలాగే రచయిత ముఖ్యోద్దేశం సంఘసంస్కరణ కాదు అనడం కూడా పూర్తిగా సమంజసం కాదు. ఇక్కడ సంఘసంస్కరణ అంటే వీరేశలింగంగారు చేపట్టిన సంఘసంస్కరణ అన్న ఉద్దేశంలో అన్నారా? సంఘంలోని లోటుపాట్లను ఎత్తిచూపడం ద్వారా కూడా సంఘాన్ని సంస్కరించే ప్రయత్నం చెయ్యవచ్చు అని ఒప్పుకుంటే, గురజాడ కన్యాశుల్కంలో ఆ ప్రయత్నం చేసాడన్నది ఒప్పుకోవలసిన విషయం.
“నాటకంలో ఈ పెళ్ళి గురించి నలుగురికీ తెలియగానే, ఆ ఊళ్ళో అన్ని కులాలవాళ్ళూ ఒకే తాటిమీద నిలబడి ఆ పెళ్ళి జరక్కుండా చెయ్యడానికి పూనుకుంటారు. అప్పటి సమాజం నిజంగా ఇటువంటి పెళ్ళికి వ్యతిరేకి అని కనిపిస్తూఉంటే, సంస్కరణ ఏమిటి? ”
ఒక్క మధురవాణి పాత్ర తప్ప, మిగతా అందరూ తమ తమ స్వార్థం కారణంగానే సుబ్బి పెళ్ళి ఆపడానికి సాయపడతారు. ఇందులో ఆనాటి సమాజం అటువంటి పెళ్ళికి వ్యతిరేకం అన్న విషయం ఎక్కడా కనిపించదు.
లుద్ధావధానుల పాత్రలోని పరివర్తన ద్వారా ఆనాటి ప్రజలలో రావల్సిన మార్పును సూచించాడు. చివరికి బుచ్చమ్మను కూడా సంస్కరణోద్యమంలో భాగమైన విధవల పునరావాస కేంద్రంలో చేర్పించడం ద్వారా తన సంఘ సంస్కరణాభిలాషని చాటుకున్నాడు.
అసలు గురజాడే స్వయంగా ముందుమాటలో
“When I wrote the play, I had no idea of publication. I wrote it to advance the cause of Social Reform and to combat a popular prejudice that the Telugu language was unsuited to the stage. ” అని చెప్పుకున్న తర్వాత, సంఘసంస్కరణ అతని ముఖ్యోద్దేశం కాదని అనడం చాలా సాహసమే! మరి అతనన్న “Social Reform” ఏమిటి?
నా ఉద్దేశంలో. కన్యాశుల్కం రచనా ధ్యేయం, ముమ్మాటికీ, సంఘంలోని లోటుపాట్లని ఎత్తిచూపడం ద్వారా సంఘసంస్కరణకి దోహదం చెయ్యడమే. ఐతే గురజాడ ఆధునిక నాటకాలలోని వాస్తవికతా లక్షణానికి ప్రభావితుడై, తన నాటకంలోపాత్రలని మూస పాత్రలుగా కాక, సమాజంలోని వివిధ రకాల మనుషులని వారి సహజ స్వాభావాలకి దగ్గరగా తీర్చిదిద్దాడు. ఈ కారణం వల్లనే మనకి నాటకంలో అటు మత మౌఢ్యంతో దురాచారాలకి పాల్పడే వారూ కనిపిస్తారు, ఇటు ఆధునికత/సంస్కరణ పేరుతో మోసాలుచేసే ఆసాములూ కనిపిస్తారు.
కన్యాశుల్కంలో మచ్చలేని (ఆ కారణంగా పూర్తిగా కాల్పనికం అనుకోదగ్గ) ఒకే ఒక పాత్ర మధురవాణి.
Velceru garu might have given more explanation on his proposition in the book and thus answers to my above questions/argument. But as I said, my curiosity has prompted me to put my comments here.
Krishna Rao Maddipati అభిప్రాయం:
September 21, 2007 11:02 am
కన్యాశుల్కం నాటకం గురజాడ వారు నిజంగా సంఘసంస్కరణోద్దేశంతోనే వ్రాశారో లేక వీరేశలింగం పంతులుగార్ని ఆట పట్టించడానికే వ్రాశారో ఆ చరిత్రనధ్యయనం చేసినవారు చెప్పాలి గాని నాలాంటి వాడి వల్ల కాదు. నేనీ నాటకాన్ని మొట్టమొదటిసారిగా 1970లో చదివినట్టు గుర్తు. నాటకం చదివే ముందు ఆ నాటకం గురించి ఒకటి రెండు వ్యాసాలు కూడా చదివినట్టు గుర్తు. ఈ నాటకం చదవడానికి ప్రేరణ ఆ వ్యాసాల్లో చదివిన విషయాలు - ముఖ్యంగా సాంఘిక దురాచారాల్ని రూపుమాపడానికి ఈ నాటకం ఎంతగా ఉపయోగపడిందో, చెప్పదల్చుకున్న విషయాన్ని హాస్యరసభరితంగా చెప్పాడో రచయిత అని చదవడంవల్ల. సరే నాటకం చదివితే కలిగే అనుభూతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు. అయితే అప్పట్లో నన్ను కొంచెం తికమక పెట్టిన విషయం, మధురవాణి, సౌజన్యారావు పంతులు మధ్య జరిగిన సంభాషణ. సౌజన్యారావంతటి ఆదర్శ న్యాయవాది, మధురవాణి ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేక పోవడం. ఇందులో ఏదో నాకు తెలియని అంతరార్ధం ఏదో ఉందని అనిపిస్తున్నా, అది ఇదమిద్ధంగా తేలలేదు. సౌజన్యారావు చెప్పేదానికి చేసేదానికి పొంతనలేదేమోననిపించినా, ప్రశ్నించడానికి ధైర్యం, అనుభవం చాలలేదు. దానిక్కారణం చాలావరకు అంతకు ముందు చదివిన వ్యాసాలు కూడా కారణమనుకుంటాను (వ్యాసకర్తలు గురులేరు). ఆ తర్వాత సినిమా చూడడమేగాని మళ్ళీ పుస్తకం చదవలేదు. ఇన్నాళ్ళ తర్వాత వెల్చేరు గారి అనువాదంలో ఉన్న మలిపలుకు చదువుతున్నప్పుడు ముప్పైయేడేళ్ళనాటి ప్రశ్నలు మళ్ళీ గుర్తుకు రావడం, వాటికి సమాధానాలు దొరకడం కూడా జరిగింది. కన్యాశుల్కం నాటకానికి అప్పట్లో సామాజిక ప్రయోజనం ఉన్నా, రచయితకు సంఘసంస్కరణోద్దేశం ఉన్నా, సంఘసంస్కర్తల్లో ఉన్న హిపోక్రసీని మాత్రం చక్కగా అద్దంలో చూపిస్తుంది. పెద్దమనుషుల్లా చెలామణి అవుతున్న వారిలోని ద్వంద ప్రవర్తనలకి (అగ్నిహోత్రావధాన్లు, రామప్పంతులు, వగైరా) అద్దం పట్టడం సరేసరి. సౌజన్యారావుకి మిగిలిన పెద్దమనుషులకీ ఆట్టే తేడాలేదనిపిస్తుంది, చివరి ఘట్టం చదివేటప్పటికి. ఇది నాటకం చదివినప్పుడు అర్ధంకాకుండా కుమ్మరి పురుగు తొలిచినట్టు వేధించి, ఇన్నాళ్ళకి వెల్చేరు గారి మలిపలుకుతో తేలికపడింది. ఇంతవరకు ఈ నాటకంపై ఎంతమంది వ్యాఖ్యానాలు చేసినా, ఇంత సమగ్రంగా మొత్తం నాటకానికి సరిపడే విశ్లేషణ వ్రాసిన వెల్చేరు గారికి ధన్యవాదాలు. ఈ నాటకంపై ఉన్న రకరకాల వ్యాఖ్యానాల దృష్ట్యా వెల్చేరు గారు ఈ విశ్లేషణను తెలుగులో కూడా ప్రచురించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కొత్తపాళీ అభిప్రాయం:
September 27, 2007 3:04 am
కామేశ్వర్రావుగారి వ్యాఖ్య బావుంది.
కానీ మేస్టారూ, గురజాడ వీరేశలింగం పంతులుకి గౌరవమిస్తూనే తనకి నచ్చని వాటిని బాగానే ఎగతాళి చేశారు - గురజాడ రాసిన సాహిత్య వ్యాసాల్లో ఒకటి పూర్తిగా వీరేశలింగం రచనల్ని విమర్శించేందుకే. ఆయన విమర్శించడం మొదలు పెడితే, వీరేశలింగం అంటే ఎంత గురుభావం ఉన్నా, ఇక ఆ వ్యంగ్యానికి అంతు లేదు. ఈ వ్యాసం విశాలాంధ్ర వారు ప్రకటించిన గురజాడ సర్వసంలో ఒక సంపుటిలో ఉంది. రాజాస్థానంలో ఉన్న గురజాడ యాంటీనాచ్ ఉద్యమాన్ని ఆమోదించక పోవడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. గురజాడ తరవాతి తరం వాడైన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, పంతులు గారిని దేవుడీ మరో అవతారంగానే భావించేవారు, ఈ వేశ్యా వ్యతిరేకత విషయంలో తప్ప.
ravikiran timmireddy అభిప్రాయం:
September 27, 2007 8:33 pm
వేలూరి గారూ, మన దేశంలో అధునికత బ్రిటీష్ వారి రాకతోనే మొదలైందని కోందరు, రాకకు మునుపే పదహారవ శతాబ్దంలోనే మొదలైందని, పలాని వాళ్ళెవరో వారి పరిశోధనల ద్వారా మనకి తెలియ చెప్పడానికి ప్రయత్నిస్తునారని మీరు చెప్పేరు. అధునికత వలస పాలనతోనో, పదహారవ శతాబ్ధంలోనో మొదలు కావటవేవిటండి. పోనీ ఆ పలాని అధునికతకి మీరేవైనా నిర్వచనం చెప్పేరా అంటే అదేంలేదు. మానవ జీవన విధానంలో అభివృధ్ధి, అధునికత వొక విడదీయలేని విషయం. అభివృద్ధి, అధునికత అనేవి రెండు ఒకే నాణానికి వున్న రెండు ముఖాల లాంటివి. ఇవి రెండూ కూడా కాలంతో పాటూ మారేవే, ముందుకు సాగేవే, అప్పుడప్పుడూ కోచేం డిప్ ఐనా. జీవనంలో (బయలోజికల్ లైఫ్ లో), జీవన విధానంలో అభివృధ్ధి ఒక అంతర్భాగం. ఆ అభువృధ్ధితో వచ్చే అధునికత ఒక continuous process. ఐతే వొక సమాజానికి సహజవైన ఈ అభివృధ్ధి, జీవన విధానంలో అధునికత, బయట శక్తుల వల్ల కూడా మార్పుకి లోనవుతాయ్. అది సముద్రాలవతల నుంచి వచ్చిన వలస పరిపాలన కావొచ్చు, సముద్రాలకివతలనుంచే వచ్చిన ఇస్లాం పాలన కావొచ్చు, పొరుగు హిందూ రాజ్యాలతో కలహాలు, విజయాలూ, అపజయాలు, లక్షా సవాలక్ష కారణాల్లో అన్నీ కావొచ్చు, ఏ వైనా కావొచ్చు.
సమాజం అనేది వొక ఓపెన్ సిస్టమ్ లాంటిది. సమాజం లోపలి ఆటుపోట్లతో పాటు, సమాజం బయట ఆటుపోట్లు కూడా సమాజస్థితిని, గతిని నిర్దేశిస్తాయ్. సంస్కృతి, సాహిత్యం అనేవి సమాజం యొక్క అట్రిబ్యూట్స్ ఐనప్పుడు అవికూడా సమాజంతో పాటూ మార్పు చెందటం సహజం కదా. ఐతే ఏవిటీ మార్పు, వొక సాపేక్షంగా నిశ్చలవైనటువంటి సాంప్రదాయ సమాజంలో, ఈ కనిపించీ, కొన్నిసార్లు కనిపించని (cause is separated in time and space from the effect) శక్తులు సృష్టించేటువంటి అనిశ్చల స్థితి. Some times this change in society’s status may be temporary, some times the society may change and move into a state that is relatively different. అంటే ఏవిటి సాంప్రదాయ సమాజం, తన పాత సాంప్రదాయాన్ని, విదిలించుకోని, వదిలించుకోని, వొక క్రొత్త సాంప్రదాయం నెలకోల్పుతుందనమాట. ఈ క్రొత్త సాంప్రదాయ సృష్టికి, సమాజం బయటనుంచి వచ్చే శక్తులే కాణంకాదు, సమాజంలో వున్నటువంటి అంతర్గత శక్తులు కూడా పాత సాంప్రదాయాన్ని మార్చి క్రొత్త సాంప్రదాయాన్ని సృష్టించగలవు. అంటే అధునికత అనేది, పాత సాంప్రదాయాన్ని పాక్షికంగానో, సంపూర్ణంగానో మార్చి వొక అధునిక సాంప్రదాయాన్ని సృష్టించటం.
“వాడికి పూర్వమే అధునికత ఉన్నది” అని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఈ ప్రక్రియ పదహారు, పదిహేడు శతాబ్ధాలనుంచి, వొక్క ఆంద్రదేశంలోనే కాదు, మానవ సమాజపు పుట్టుకనుంచి ఈ విధంగానే సాగుతుందని చెప్పదానికి నూతన పద్దతుల్లో పరిశోధనలవసరం లేదు.
“వలస రాజ్యం తరువాత వచ్చిన అధునికత సాంప్రదాయ విరుద్దం అని చెప్పవచ్చు”, “బ్రితీషు వలస విధానం వలన వచ్చిన అధునికత, చారిత్రకంగా సంప్రదాయంగా వచ్చిన అధినికతని అణగ దొక్కింది” అధునికత అనేదే దేశీయమైన, విదేశీయమైనా సాంప్రదాయాన్ని త్రోసిరాజని క్రొత్త సాంప్రదాయాన్ని సృష్టించడమైనప్పుడు ఈ మాటలకర్థం ఏవిటి? ఆ మారిన సమాజంలో వచ్చిన క్రొత్త సాంప్రదాయంలో వుండే తప్పొప్పులకు బయటిశక్తులను కారణంగా చూపించి, ఆ తప్పులకు ముసుగు కప్పాల్సిన అవసరం లేదు. ఆ తప్పులకు, క్రొత్త సాంప్రదాయంలో పతనమైన విలువలకు, కారణం వలస రాజ్యవైనా, ఆ తప్పులని సంస్కరించుకునే భాద్యత మన సమాజానిదే.
“అప్పారావుగారు తన నాటకంలో దిగజారిపోతున్న సమాజాన్ని, నైతికంగా పతనమవుతున్న సమాజాన్నీ సమర్పించలేదు. నైతిక వైరుధ్యం సమాజంలో ఎప్పుడన్నా ఎక్కడన్నా తలయెత్తితే ఆ సమాజం తనకు తానుగా మార్పు తెచ్చుకోగల స్థితిలో ఉన్నది కాని, సాంఘిక సంస్కరణకోసం ఎదురు చూడలేదు.” నిజవేనండీ, ఏ సమాజవైనా తన నడకలో, అప్పుడప్పుడూ ఒకటి రెండడుగులు వెనకకు వయ్యడం సహజవే, ఆ అడుగుల్ని సరిచేసుకోని ముందుకు పోవడం సహజవే. కాకపోతే ఆ సరిచేసుకునే క్రమంలో, సంఘసంస్కరణ, సంఘసంస్కర్తలు అనే అంశాలు కూడా సహజవైనవే. సంఘసంస్కరణ సమాజం తనని తాను సరిచేసుకునే క్రమాన్ని మరింత వేగవంతం చేయడం కోసం, సమాజంకన్నా ఒకటిరెండడుగులు ముందుకు చూడగలిగిన (అన్ని విషయాల్లో కాకపోవచ్చు, అన్ని కాలాల్లో కాకపోవచ్చు) వ్యక్తుల ప్రయత్నం. ఆ సంస్కర్తలు తమకన్నా వొకడుగు వెనకబడిన వాళ్ళని సంస్కరించడానికి, తమకన్నా వొకడుగు ముందరున్న వాళ్ళని వెలివేయడానికి (మిగిలిన చాంధసులలాగానే) చూస్తారు. అప్పారావుగారి సౌజన్యారావు పంతులు ఈ సంస్కర్తలలో వుండే ఈ ద్వందాన్ని చూపించడానికేనని నా అభిప్రాయం. ఐతే వొక్కడుగు ముందుచూపున్న ఈ సంస్కర్తలని మనవీరోజు వాళ్ళకి రెండడుగుల ముందుచూపు లేదని విమర్శ చేయాల్సిన పనిలేదు, అసలు ముందుచూపే లేని సమాజంలో కనీశం ఆ మాత్రంముందుచూపు కలిగిన సంస్కర్తలు ఆ సమాజ మార్పుకి కేటలిస్ట్లాగా ఎంతో ఉపయోగపడ్డారు. అప్పారావు గారికి ఈ విషయం తెలుసుగాబట్టే సౌజన్యారావు పంతులుగారిని సృష్టించారని నా అభిప్రాయం. ఈ వొక్క పాత్ర చిత్రణలోనే అప్పారావు గారు అప్పటి సమాజానికాన్నా ఎంత ముందున్నారో మనకర్థవవుతుంది. లోపాన్ని ఎత్తి చూపించటం సంఘ సంస్కర్తలని తేలికపరచడవో, అగౌరపరచడవో, లేకపోతే ఆ సంఘసంస్కరణని గేలిచేయడవో కాదు.
“ఈ సమాజం తనపై తనకి ఉన్న నమ్మకాన్ని వమ్ము చేసేటంత వత్తిడి బ్రిటీషు వలస విధానం తెచ్చిపెట్టిన ఉధృతం. ఇందుచేత పైకులాలు తమ ప్రాథమిక యోగ్యతలని మరిచిపోవడం జరిగింది.” అంటే పై కులాలు తమ ప్రాధమిక యోగ్యతలని మరచిపోకపోవడవే మన హిందూ సమాజాన్ని సరిఅయిన దారిలో వుంచుతుందా? అసలు ఏ సమాజం తెచ్చిన వత్తిడి పైకులాల్ని సృష్టించిందో మరి. ఏ వుధృతి, ఏ వత్తిడి సమాజాన్ని కులాలుగా విభజించిందో? ఆ యోగ్యతలని మరచిపోయి దిగజారిన పైకులాల్ని కొంచం పైకి లాగి పూర్తిగా కాకపోయినా కొంచంగానైనా మిగిలిన కులాల సరసన కూర్చోబెట్టింది ఆ వలస పాలన వత్తిడేనేవో.
నాటకంలో ఏడవ అంకం ఆఖరి రంగాన్ని క్లుప్తంగా వివరించిన తర్వాత, వేలూరిగారు, ఆ అంకంలో మధురవాణి పాత్ర మీద తమ అభిప్రాయాన్ని ఈ విధంగా వివరించారు. “సౌజన్యా రావు కున్న అమాయకత్వపు సంస్కరణాభిలాష దెబ్బతియ్యడానికి మధురవాణి బృహన్నాటకం ఆడుతూ వుండవచ్చు. ఆధునికుడు, పాశ్చాత్య ప్రాభవంలో పెరిగిన పెద్దమనిషి, నీతులు వల్లించే వాడికి గుణపాఠం చెప్పడానికి మధురవాణి వచ్చి వుండవచ్చు. లేదా, కాలం మారుతున్నది; తన దగ్గిరకి గౌరవనీయులైన వాళ్ళెవ్వరూ రారేమో నన్న భయం పుట్టి వుండవచ్చు. — ఏది ఏమో? వీటికి సమాధానం అప్పారావుగారికే తెలియక పోవచ్చు!” ఇన్ని రకాలుగా విశ్లేషించగలిగిన వేలూరిగారు, ఆ అంకాన్ని చదవగానే, మనసుకి తోచే అత్యంత సరళవైన, సహజవైన, నాటకంలో చెప్పిన కారణాన్ని మాత్రం మర్చిపొయ్యారు. వయసు పైబడిన, చేయనినేరానికి శిక్ష పడే అవకాశమున్న, ఆ చెయ్యని నేరం ఆ బాపడి తలమీద పడటంలో తన పాత్ర గురించి తెలిసిన వొక మంచి మనిషిగా లుబ్ధావదాన్లుకి సహాయం చేయడం కోసవే మధురవాణి పంతులుగారింటికి వెళ్ళిందనే విషయం. ఇంత సరళవైన, సహజవైన విషయం వేలూరిగారికి ఎందుకు తట్టలేదో మరి. వెళ్ళిన తర్వాత, పంతులుగారి వెనకనున్న నలుపు, పంతులుగారికి కనిపించకపోతే దాన్ని తెలివిగా ఎత్తిచూపించటం, పంతులుగార్ని అవమానం చెయ్యడానికి కాదని తిరిగి చెప్పల్సిన అవసరం లేదు. వేశ్యని చూడటానికి, మాట్లాడడానికి కూడా విముఖుడైన పంతులు గారు, మధురవాణికి భగవత్ గీతని బహుకరించి, తనతో షేక్ హేండ్ చేయటంలోనే, తన తప్పుని గ్రహించారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
వేలూరిగారు ఇంత అసహజవైన విశ్లేషణ ఎందుకు చేశారో తరువాతి పేరాలో అర్థమవుతుంది. వేలూరిగారి మాటల్లోనే వారి వివరణ ఇలా సాగుతుంది. “ఈ దృష్టితో చదివితే ఒక అంచెలో ( ఈ నాటకాన్ని వేరువేరు అంచెల్లో వ్యాఖ్యానించడానికి తావుంది) వచ్చే ఊహ: మధురవాణి గొంతుతో కందుకూరి వీరేశలింగం పంతులు గారిని, ఆయన చేపట్టిన వేశ్యా సంస్కరణోద్యమాన్నీ వేళాకోళం చేస్తున్నట్టు కనిపిస్తుంది. విషయమేమిటంటే, నాటక రచయిత ముఖ్యోద్దేశం సంఘ సంస్కరణ కాదు ; ఆ సంస్కరణలో నిజమైన సాంఘిక విలువ ఏమీ లేదు. ఈ సంస్కరణ ఘోష కేవలం వలస రాజ్య విధానం వల్ల ఏర్పడ్డ బూటకపు మాయ అని బోధపడుతుంది.” ఇదండీ అప్పారవుగారు కన్యాసుల్కం నాటకం వ్రాయడంలో ఉద్దేశం, వీరేశలింగం పంతులుగారిని వేళాకోళం చేయడానికే. అప్పారవుగారి ఉద్దేశం సంఘసంస్కరణ కాదట, సంఘంలో వుండే నీచ సాంప్రదాయాల్ని పైకెత్తి చూపించడం సంస్కరణాకాంక్ష కాక మరేవిటో. ఆ సంస్కరణలో నిజవైన సాంఘీక విలువ లేదుట. ఏ సంస్కరణలో వేలూరి గారూ? తెలిసీ తెలియని లేత వయసులోనే ఆడ కూతుళ్ళని, చావుకి జానెడు దూరంలో వున్న ముసలాళ్ళకిచ్చి కట్టబెట్టటలో వున్న నీచత్వాన్ని చూపించడంలోనా? లేకపోతే, పరిష్కారం చూపించకుండానే, మూర్ఖంగా మరికొందరాడ కూతుళ్ళని పొగపెట్టి తరివెయ్యడం అనే సంస్కరణలో వుండే మూఢత్వాన్ని బహిర్గతం చెయ్యటంలోనా? మీకు దేంట్లో సంఘసంస్కరణాభిలాష కనపళ్ళేదు సార్.
ఈ అసహజ విశ్లేషణ తర్వాతి కొద్ది పేరాల్లో అబద్దాల జాతరగా పరిణితి చెందుతుంది. “నాటకంలో ఈ పెళ్ళి గురించి నలుగురికీ తెలియగానే, ఆ ఊళ్ళో అన్ని కులాలవాళ్ళూ ఒకే తాటిమీద నిలబడి ఆ పెళ్ళి జరక్కుండా చెయ్యడానికి పూనుకుంటారు. పూజారి, పోలీసు, సేవకులు, స్కూలు పిల్లడు, పెళ్ళికొడుకు కూతురు (మీనాక్షి) అంతా ఈ పెళ్ళి కుదిర్చిన జిత్తులమారి రామప్పంతులునీ, పెళ్ళికొడుకుని మూర్ఖులుగా బయట పెడతారు. అప్పటి సమాజం నిజంగా ఇటువంటి పెళ్ళికి వ్యతిరేకి అని కనిపిస్తూఉంటే, సంస్కరణ ఏమిటి? ఎవరో, సౌజన్యారావు లాంటి అమాయకులు, సమాజం కుళ్ళిపోయిందని భ్రమించి, ఆ భ్రమని నమ్మి, సంస్కరించేద్దామన్న కుతూహలంతప్ప?”
మీరే కన్యాశుల్కాన్ని విశ్లేషిస్తున్నరో అని అనుమానంగా వుంది వేలూరి గారు. గురజాడ గారి కన్యాశుల్కంలో మీరు మీ మనసులో ఏఏ మార్పులు చేసుకున్నారో, ఏఏ చేర్పులు చేసుకునారో! నే చదివిన కన్యాశుల్కంలో, పెళ్ళీ ఆపడం కోసం బావిలో దూకి ప్రాణం తీసుకోడానికి సిద్ద పడిన సుబ్బి అమ్మ, మేన కోడలు బతుకు బండలై పోకుండా వుండాలని కరటక శాస్త్రి, చెల్లెలి బతుకు తన బతుకులా నాశనవై పోకూడదని లేచిపోవడానికి తెగించిన బుచ్చమ్మ, కరటక శాస్త్రితో వున్న పరిచయంతో, తోటి మనిషికి తనవంతు సహాయం చెయ్యడానికోచ్చిన మధురవాణి, తెలొసో తెలియకో కరటక శాస్త్రి చెప్పేడు కాబట్టి శిష్యుడు మహేశం తప్ప సుబ్బి బాగు కోసం పెళ్ళి అపాలనుకున్న వాళ్ళు మరెవరూ నాకు కనపడలేదు సార్. తన సౌభాగ్యం ఎంత బాగుందో ప్రత్యక్షంగా అనుభవిస్తున్న మీనాక్షి కూడా పెళ్ళి ఆపడానికి ప్రయత్నం చేసిందని చెప్పలేం ( తన పరిస్థితిలో తన పరిధికి మించిన విషయమే కాదనలేం).
ఇంతకాలం ఈ నాటకాన్ని విమర్శకులు సరిగా అర్థం చేసుకోలేక పోయారట, పసిపిల్లకి వైధవ్యాన్ని తెచ్చిపెట్టే సంస్కృతి, కుళ్ళిపోఇందని భ్రమ పడ్డారట, ఈ పరిస్థితిని సంస్కరణల ద్వార మార్చాలని ఈ నాటకం భోధిస్తున్నదని ఆపోహ పడ్డారట. ఈ ఆపోహకి వేల్చేరు నారాయణరావు గారు నాలుగు కారణాలిచ్చారట. వేల్చేరు గారి కారణాలేవో నేను చదవలేదు, అందుకని వారి కారణాల గురించి నేను మాట్లాడటం పద్దతికాదు.
ఏ వలస సమాజపు విలువలు, మరే మత విలువలతోనూ సరి చూసుకోనవసరం లేకుండానే, చిన్న పిల్లలని అమ్ముకునే సమాజపు విలువలు అతి నీచవైనవని చెప్పోచ్చు. ఐతే ఆ నిజాన్ని త్రొక్కి పట్టడానికి, పద్దెనిమిది, పంతొమ్మిదో శతాబ్దపు బ్రాహ్మణవర్గ సమాజాన్ని పైకెత్తటానికే కన్యాశుల్కానికి, ఈ అసంబద్దవైన, అసహజవైన, అశాస్త్రియవైన విశ్లేషణల అవసరంపడిందని నా అభిప్రాయం.
ఈ వ్యాసానికి ఆలంబనలుగా పలు రెఫరెన్సులు, ఆ తర్వాత అనుభంధంలో పలువురి అభిప్రాయాలు ఇవ్వడం జరిగింది. ఐతే ఇక్కడొక్క విషయం చెప్పదలుచుకున్నను. ఈ నాటకవేవీ అతి క్లిష్టవైన scientific concept కాదు. ముందు వెనుకల చరిత్ర పఠనం, క్రొత్త పరిశోధనా పద్దతులు, కనీసం పాత పరిశోధనా పద్దతులు, గతితార్కిక భౌతికవాదం, మాక్సిస్టు వివరణలు, హైజాకులు, ఇవేవీ అవసరం లేకుండానే గురజాడ వారు ఏంచెప్పేరో, ఎందుకు చెప్పేరో, ఏ తప్పుల్ని హైలైట్ చేయదలుచుకున్నరో, ఏ వాస్తవాల్ని, ఏ మూఢత్వాల్ని, ఏ నీచాల్ని, ఏ అవినీతిని, మనుషుల్లో వుండే ఏ మంచి చెడుల్ని, మంచి మనుషులనబడే వాళ్ళలో ఏ చెడ్డని, చెడ్డవాళ్ళనబడే వాళ్ళలో ఏ మంచిని, ఆ కాలపు సంఘానికి తలమానికవనబడే కులంలో కనపడే నీచ సాంప్రదాయాల్ని, అతి సళంగా, అతి మెలుకువగా, ఎక్కడా ఏ విమర్శకుల, విశ్లేషకుల అవసరంలేకుండా, అతి సామాన్య పాఠకుడికి సైతం అర్థవయ్యేరీతిలో చెప్పేరు. ఈ నాటకంలో, అక్షరంలో కనపడని వివరణలకోసం, విశ్లేషణలు చేయడవంటే, చురుక్కుమనే నిజవేదో కన్యాశుల్కంలో మనకి తగిలిందనమాట.
వాడపల్లి శేషతల్పశాయి అభిప్రాయం:
November 19, 2007 2:22 pm
కన్యాశుల్కమును ఆంధ్రభారతిలో క్రిందిచోట చదువగలరు.
http://www.andhrabharati.com/nATakamulu/index.html
నమస్సులతో,
శాయి.
Tadepalli Hari Krishna అభిప్రాయం:
February 3, 2008 12:44 pm
కన్యాశుల్కము కొన్ని నిర్ణీత దేశకాలపరిమితుల్లో ప్రబలంగా ఉన్న సంఘదురాచారాలకి స్పందిస్తూ అప్పారావుగారు వ్రాసిన నాటకం. వితంతు వివాహాలూ, బాల్యవివాహాలూ, కన్యాశుల్కాలూ అనేవి 19వ శతాబ్దమధ్యంలో విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో _కొన్ని_ బ్రాహ్మణ వర్గాలకి మాత్రమే పరిమితాలైన దురాచారాలు. సమకాలంలో ఈ దురాచారాల వ్యాప్తి, విస్తృతి, సందర్భత ఎంతమాత్రం? గురజాడ కాలంలో కూడా ఈ సమస్యలు ఆయా స్థల,కుల, వర్గ పరిమితులు దాటితే, కన్యాశుల్కానికున్న సమాజప్రయోజనం అంతంతమాత్రం. ఇదేరకంగా బెంగాలులో రాజారామ్ మోహన్ రాయ్ వంటి వాళ్ళు బాల్యవివాహాలకీ, సతీ దురాచారాలకీ వ్యతిరేకంగా ఘోషించారు. కానీ అవెంతవరకూ సమకాలికసమస్యలు? అయినాకూడా, కన్యాశుల్కాన్ని నిత్యనూతనంగా పున:పఠించుకోడమూ, మంగళస్తోత్రాలు పాడుకోడమూ, ఏటేటా పందిళ్ళు వేసుకుని వడపప్పు పానకాలు సేవించడాలూ, కొందరు సాహిత్యపిపాసువులకి ఈనాటికీ పవిత్రవంశాచారం.
షేక్స్పియర్ నాటకాలకులాగున, కాళిడాసు నాటకాలలా, లేదా ప్రబంధకావ్యాలలా - కన్యాశుల్కం కూడా ఈనాడుఈఒకానొక సాహిత్యరత్నం. కన్యాశుల్కానికి సాహిత్యవిలువే తప్ప ఏవిధమైన సామాజిక విలువా లేదని ఈ ప్రస్తుత లేఖరి గాఢవిశ్వాసం.
విపరీతంగా పెచ్చరిల్లిన పెట్టుబడిదారి తనము, హేయరాజకీయాలు, ప్రపంచీకరణ పేరిట అరుగుతున్న అల్పవర్గాల దోపిడీ, విద్యోపాధులపేరిట జరుగుతున్న బాలల చిత్రవధ, బతుకంతా రెక్కలువిరుచుకు పెంచిన సంతానాలు ఆకస్మికంగా విదేశాలకి వలసపోయి మరి తిరిగిరాకపోడం, భూమి విడిచి సాముచేసే ఆర్థికవిధానాలు, కూలిపోయిన ప్రభుత్వాంగాలు, అవయవవ్యాపారాలు చేసే కార్పరేట్ హాస్పిటళ్ళూ, ఏనాటికీ మారని చిరుద్యోగుల జీవితాలూ, కులప్రాతిపదికాలైన రాజకీయాలూ, …ఇవీ ఈనాటి సమాజం పడే ఈతి బాధలు. వీటికీ కన్యాశుల్కానికీ ఉన్న సాహిత్య సంబంధమల్లా సమకాలసమస్యలని తవ్వి తలకెత్తడం మాత్రమేను. గ్రహించిన కన్యాశుల్కప్రియులందరూ 1950 దశకానికిటుపక్కికి ఉత్తిష్ఠులై సమకాల సంఘదురాచారాలకి కూడా తమ రెటినాల్లో కొంత చోటిస్తే బాగుంటుంది. అటువంటి సాహిత్యాన్ని పఠనీయంగా విమర్శింఛి చూపిస్తే మరింత ప్రయోజనకరం.
- తాడేపల్లి హరికృష్ణ