<?xml version="1.0" encoding="UTF-8"?><!-- generator="wordpress/2.0.2" -->
<rss version="2.0" 
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/">
<channel>
	<title>Comments on: కృష్ణరాయల కవిపోషణ</title>
	<link>http://www.eemaata.com/em/issues/200605/80.html</link>
	<description>An Electronic Magazine in Telugu for a World without Boundaries</description>
	<pubDate>Thu, 08 Jan 2009 20:07:46 +0000</pubDate>
	<generator>http://wordpress.org/?v=2.0.2</generator>

	<item>
		<title>by: Dr.Ismail Penukonda</title>
		<link>http://www.eemaata.com/em/issues/200605/80.html#comment-130</link>
		<pubDate>Wed, 07 Jun 2006 10:12:05 +0000</pubDate>
		<guid>http://www.eemaata.com/em/issues/200605/80.html#comment-130</guid>
					<description>మంచి వ్యాసం.ఇలాంటి విజ్ఞానదాయకమైన చర్చ ను ఆస్వాదించడం...నా అదృష్టం!</description>
		<content:encoded><![CDATA[<p>మంచి వ్యాసం.ఇలాంటి విజ్ఞానదాయకమైన చర్చ ను ఆస్వాదించడం&#8230;నా అదృష్టం!
</p>
]]></content:encoded>
				</item>
	<item>
		<title>by: kari venkataratnam babu</title>
		<link>http://www.eemaata.com/em/issues/200605/80.html#comment-98</link>
		<pubDate>Thu, 11 May 2006 13:34:39 +0000</pubDate>
		<guid>http://www.eemaata.com/em/issues/200605/80.html#comment-98</guid>
					<description>రామారావు గారు,

వాడపల్లి వారు చెప్పిన వెబ సైట్ లో రాయలు అష్టదిగ్గజాల గురించి వెంకటరమణయ్య గారు విపులంగా తెలియజెప్పిరి.గత తరములో, శాసన సాహత్య వ్యాసంగములలో మహానుభావుడీయన. మన తరము లో అంతటి వారు ఎవరున్నారు? పరుచూరి వారు పాశ్చాత్యుల పుస్తకాలతో మాత్రమే మన చరిత్ర పరిశీలనా మార్గమనుట సమంజసమా? కాదు.పరిశీలంచని రాయలు కాలము నాటి రాళ్ళపైరాతలు చాలా వున్నవి, తాళ పత్రములున్నవి. ఈ మధ్యనే తాళ పత్రముల కంప్యుటీకరణ మొదలయినది. శాసనముల కంప్యుటీకరణ జరిగినట్లు సమాచారము అందలేదు. వాడపల్లివారో,మరొకరో, వెబ్ లో  ఎక్కడైనా దొరకు ఈ సమాచారము మనకందిచిన మీ పరిశీలనా వ్యాసంగము సులభతరమగును.

ఈమాట మే సంచికలొ మీ వ్యాసమునకు లభించిన అభిప్రాయముల వరుసను పరిశీలించితే, ప్రవాసులలో సాహిత్యము చరిత్ర వ్యాసంగ వ్యసనమున్న వారు చాలమంది వున్నారు. కనుక రాబొవు ఈమాట లో మరొ వ్యాసాన్ని ఆశించుదాం.

ఇక శెలవు</description>
		<content:encoded><![CDATA[<p>రామారావు గారు,</p>
<p>వాడపల్లి వారు చెప్పిన వెబ సైట్ లో రాయలు అష్టదిగ్గజాల గురించి వెంకటరమణయ్య గారు విపులంగా తెలియజెప్పిరి.గత తరములో, శాసన సాహత్య వ్యాసంగములలో మహానుభావుడీయన. మన తరము లో అంతటి వారు ఎవరున్నారు? పరుచూరి వారు పాశ్చాత్యుల పుస్తకాలతో మాత్రమే మన చరిత్ర పరిశీలనా మార్గమనుట సమంజసమా? కాదు.పరిశీలంచని రాయలు కాలము నాటి రాళ్ళపైరాతలు చాలా వున్నవి, తాళ పత్రములున్నవి. ఈ మధ్యనే తాళ పత్రముల కంప్యుటీకరణ మొదలయినది. శాసనముల కంప్యుటీకరణ జరిగినట్లు సమాచారము అందలేదు. వాడపల్లివారో,మరొకరో, వెబ్ లో  ఎక్కడైనా దొరకు ఈ సమాచారము మనకందిచిన మీ పరిశీలనా వ్యాసంగము సులభతరమగును.</p>
<p>ఈమాట మే సంచికలొ మీ వ్యాసమునకు లభించిన అభిప్రాయముల వరుసను పరిశీలించితే, ప్రవాసులలో సాహిత్యము చరిత్ర వ్యాసంగ వ్యసనమున్న వారు చాలమంది వున్నారు. కనుక రాబొవు ఈమాట లో మరొ వ్యాసాన్ని ఆశించుదాం.</p>
<p>ఇక శెలవు
</p>
]]></content:encoded>
				</item>
	<item>
		<title>by: వాడపల్లి, శేష తల్ప శాయి</title>
		<link>http://www.eemaata.com/em/issues/200605/80.html#comment-94</link>
		<pubDate>Wed, 10 May 2006 08:17:14 +0000</pubDate>
		<guid>http://www.eemaata.com/em/issues/200605/80.html#comment-94</guid>
					<description>సుప్రసిద్ధ చరిత్రకారులు డాక్టర్ నేలటూరి వేంకట రమణయ్యగారు
&quot;అష్టదిగ్గజ నిర్ణయము&quot; అను పేర 2-12-57న
చేసిన ఉపన్యాస పాఠమును క్రిందిచోట చదువ గలరు.
http://www.andhrabharati.com/vachana/upanyAsamulu/aShTadiggajamulu.html

దీనిని &quot;ఆష్టదిగ్గజములు&quot; అను పుస్తకమున 1960లో ప్రచురించించారు.

దీనిపై సమీక్షావ్యాసములు జనవరి, మార్చి 1962 &quot;భారతి&quot; పత్రికలలో ఉన్నాయి.
వీటిలోనూ విలువైన సమాచారము ఉన్నది.

మంచిచర్చకు దోహదపడుతాయని భావిస్తాను.

నమస్సులతో,
శాయి.</description>
		<content:encoded><![CDATA[<p>సుప్రసిద్ధ చరిత్రకారులు డాక్టర్ నేలటూరి వేంకట రమణయ్యగారు<br />
&#8220;అష్టదిగ్గజ నిర్ణయము&#8221; అను పేర 2-12-57న<br />
చేసిన ఉపన్యాస పాఠమును క్రిందిచోట చదువ గలరు.<br />
<a href='http://www.andhrabharati.com/vachana/upanyAsamulu/aShTadiggajamulu.html' rel='nofollow'>http://www.andhrabharati.com/vachana/upanyAsamulu/aShTadiggajamulu.html</a></p>
<p>దీనిని &#8220;ఆష్టదిగ్గజములు&#8221; అను పుస్తకమున 1960లో ప్రచురించించారు.</p>
<p>దీనిపై సమీక్షావ్యాసములు జనవరి, మార్చి 1962 &#8220;భారతి&#8221; పత్రికలలో ఉన్నాయి.<br />
వీటిలోనూ విలువైన సమాచారము ఉన్నది.</p>
<p>మంచిచర్చకు దోహదపడుతాయని భావిస్తాను.</p>
<p>నమస్సులతో,<br />
శాయి.
</p>
]]></content:encoded>
				</item>
	<item>
		<title>by: Sreenivas Paruchuri</title>
		<link>http://www.eemaata.com/em/issues/200605/80.html#comment-80</link>
		<pubDate>Sun, 07 May 2006 13:12:34 +0000</pubDate>
		<guid>http://www.eemaata.com/em/issues/200605/80.html#comment-80</guid>
					<description>1. రామారావుగారు &quot;రాయవాచకాన్ని మంత్రులకోసం రాసిన పాఠ్యపుస్తకంగాను, &quot;కృష్ణరాయవిజయాన్ని&quot; రాయల యుద్ధవిజయాల మీద కావ్యంగాను &quot;క్లుప్తీకరించడం&quot; ఆశ్చర్యాన్ని కలిగించింది. నిజానికి ఈ రెండు పుస్తకాల మీద విస్తృతమైన పరిశోధనా వ్యాసాలే వెలువడ్డాయి. ముఖ్యంగా శ్రీ సి. వి. రామచంద్రరావు రాసిన 2 పుస్తకాలు, &quot;రాయవాచకం&quot;పై P. Wagoner విస్తృతానువాదం/చర్చ: Tidings of the king ఈ సందర్భంలో చూడదగ్గవి.
రామారావే గారే ఉదహరించిన Textures of time లో 30-40 పేజీల చర్చ వుంది. ఇంకా చాలా చెప్పవలసి వుంది కానీ, ఇది సరయిన జాగా కాదేమో!

2. కామేశ్వరరావుగారు (2006లో కూడా) ఆముక్తమాల్యద కావ్యకర్త రాయలుకాదనే వాదనను కొట్టివేయలేం అనడం కూడా నాకాశ్చార్యాన్ని కలిగించింది.

3. విప్లవ్ గారు కోరిన/అడిగిన (సాంఘిక, సామాజిక) స్థితిగతులపైన సమాచారం నిజానికి అందుబాటులోనే వుంది. గత 30-40 సంవత్సరాలలో అధిక సంఖ్యలో పరిశోధనా వ్యాసాలు, పుస్తకాలు (ఎక్కువభాగం పాశ్చాత్యులవి) వెలువడ్డాయి.
ఆ మాటకొస్తే, నారాయాణరావుగారు సందేహించినట్లు, రాయలు కవి పక్షపాతి అని చూపించే ఆధారాలే ఈనాటికీ బయటపడలేదు.

4. అష్టదిగ్గజాలు వున్నట్లు కూడా ఎలాంటి ఆధారాలు లేవు. ఉదాహరణకి ఆరుద్ర &quot;సమగ్రాంధ్రసాహిత్యం&quot;లో ఇవ్వబడిన Table ని చూడండి. ఇక్కడా కూడా చాలా వివరణ అవసరం వుంది. ఇది 17 శతాబ్దంలో వచ్చిన ఒక phenomena. భోజుడిగురించి, అక్బర్ గురించి ... ఇలాంటి కథలే ఆ కాలంలో ప్రచారంలోకి వచ్చాయి.

5. Burton Stein, Vasundhara Filliozat, రాళ్ళపల్లి చేసిన రచనలు ఆకాశానికి ఎత్తివేయబడ్డాయి. రాళ్ళపల్లి రాయల మీద రాసినవి నాకు తెలిసి మూడు వ్యాసాలు. ఆ మూడు వ్యాసాల్లో ఎక్కడ మన ప్రస్తుత చర్చకు ఉపయోగపడే విషయాలున్నాయో ఆ చరిత్రను &quot;అవలోడనం&quot; చేసిన విజ్ఞులు తెలుపగలరు. అలానే Stein, Filliozat రచనలు కూడా.

ఏదేమయినా, తెలుగు వారి సౌకర్యార్థం గత 30 యేళ్ళలో &quot;విజయనగరం&quot; మీద English, French, Portugese, German లలో వచ్చిన పరిశోధనా విషయాలను క్రోడీకరించి రాయవలసిన అవసరం వుందని అనిపిస్తుంది.

భవదీయుడు,
శ్రీనివాస్</description>
		<content:encoded><![CDATA[<p>1. రామారావుగారు &#8220;రాయవాచకాన్ని మంత్రులకోసం రాసిన పాఠ్యపుస్తకంగాను, &#8220;కృష్ణరాయవిజయాన్ని&#8221; రాయల యుద్ధవిజయాల మీద కావ్యంగాను &#8220;క్లుప్తీకరించడం&#8221; ఆశ్చర్యాన్ని కలిగించింది. నిజానికి ఈ రెండు పుస్తకాల మీద విస్తృతమైన పరిశోధనా వ్యాసాలే వెలువడ్డాయి. ముఖ్యంగా శ్రీ సి. వి. రామచంద్రరావు రాసిన 2 పుస్తకాలు, &#8220;రాయవాచకం&#8221;పై P. Wagoner విస్తృతానువాదం/చర్చ: Tidings of the king ఈ సందర్భంలో చూడదగ్గవి.<br />
రామారావే గారే ఉదహరించిన Textures of time లో 30-40 పేజీల చర్చ వుంది. ఇంకా చాలా చెప్పవలసి వుంది కానీ, ఇది సరయిన జాగా కాదేమో!</p>
<p>2. కామేశ్వరరావుగారు (2006లో కూడా) ఆముక్తమాల్యద కావ్యకర్త రాయలుకాదనే వాదనను కొట్టివేయలేం అనడం కూడా నాకాశ్చార్యాన్ని కలిగించింది.</p>
<p>3. విప్లవ్ గారు కోరిన/అడిగిన (సాంఘిక, సామాజిక) స్థితిగతులపైన సమాచారం నిజానికి అందుబాటులోనే వుంది. గత 30-40 సంవత్సరాలలో అధిక సంఖ్యలో పరిశోధనా వ్యాసాలు, పుస్తకాలు (ఎక్కువభాగం పాశ్చాత్యులవి) వెలువడ్డాయి.<br />
ఆ మాటకొస్తే, నారాయాణరావుగారు సందేహించినట్లు, రాయలు కవి పక్షపాతి అని చూపించే ఆధారాలే ఈనాటికీ బయటపడలేదు.</p>
<p>4. అష్టదిగ్గజాలు వున్నట్లు కూడా ఎలాంటి ఆధారాలు లేవు. ఉదాహరణకి ఆరుద్ర &#8220;సమగ్రాంధ్రసాహిత్యం&#8221;లో ఇవ్వబడిన Table ని చూడండి. ఇక్కడా కూడా చాలా వివరణ అవసరం వుంది. ఇది 17 శతాబ్దంలో వచ్చిన ఒక phenomena. భోజుడిగురించి, అక్బర్ గురించి &#8230; ఇలాంటి కథలే ఆ కాలంలో ప్రచారంలోకి వచ్చాయి.</p>
<p>5. Burton Stein, Vasundhara Filliozat, రాళ్ళపల్లి చేసిన రచనలు ఆకాశానికి ఎత్తివేయబడ్డాయి. రాళ్ళపల్లి రాయల మీద రాసినవి నాకు తెలిసి మూడు వ్యాసాలు. ఆ మూడు వ్యాసాల్లో ఎక్కడ మన ప్రస్తుత చర్చకు ఉపయోగపడే విషయాలున్నాయో ఆ చరిత్రను &#8220;అవలోడనం&#8221; చేసిన విజ్ఞులు తెలుపగలరు. అలానే Stein, Filliozat రచనలు కూడా.</p>
<p>ఏదేమయినా, తెలుగు వారి సౌకర్యార్థం గత 30 యేళ్ళలో &#8220;విజయనగరం&#8221; మీద English, French, Portugese, German లలో వచ్చిన పరిశోధనా విషయాలను క్రోడీకరించి రాయవలసిన అవసరం వుందని అనిపిస్తుంది.</p>
<p>భవదీయుడు,<br />
శ్రీనివాస్
</p>
]]></content:encoded>
				</item>
	<item>
		<title>by: విప్లవ్</title>
		<link>http://www.eemaata.com/em/issues/200605/80.html#comment-77</link>
		<pubDate>Sun, 07 May 2006 05:43:49 +0000</pubDate>
		<guid>http://www.eemaata.com/em/issues/200605/80.html#comment-77</guid>
					<description>భూషణ్ గారు కోట్ చేసిన పేరా తరువాత అదే తెలుగు నాడిలో వెల్చేరు గారు ఒక వాక్యం రాసారు: &quot;ఇదీ ఈ పద్యానికి పైకి కనిపించే అర్ధం.&quot; అని.

ఆ తరువాత ఎలా అర్ధం చేసుకోవాలో చెబుతూ, పండితులు కవులు రాజాశ్రయం కోసం వస్తారు ... వాళ్ళకు అగ్రహారాలూ, అక్షర లక్షలూ ఇవ్వక్కరలేదు ... అంటూ కనీసం రెండు రకాలుగా అర్ధాలు చెప్పారు (సంపాదకులు ఆ పూర్తి వ్యాసం అందరికీ అందుబాటులో ఉండేలా చూడటం వల్ల నష్టం లేదు అనుకుంటాను, ముఖ్యంగా ఆ శీర్షిక పేరు: &quot;ఒక తెలుగు పద్యాన్ని పరిచయం చేసే శీర్షిక&quot; అన్న విషయంతో సహా).

అయినా ఇంత చిన్న పరిచయానికే &quot;కృష్ణరాయల కీర్తికే కళంకం&quot; వచ్చేట్లయితే, ఆ కీర్తి ఆనుపానుల మీద నిజంగా డౌటు వచ్చి తీరాలి.

నాదొక సందేహం:

(అన్ని వ్యాఖ్యలనూ పక్కకు పెట్టి నాకు నేను అర్ధం చేసుకోవటానికి ప్రయత్నం చేసాను).
ఇది ఒక ఉపమానం అయి ఉండవచ్చా: పండితులకూ, భిక్షులకూ ఊళ్ళు పంచి ఇస్తే -- ముఖ్యంగా డబ్బు దస్కం, ఈ రెండు కులాల వారిని కులభ్రష్టులుగా మిగులుస్తుంది, అందుకే వాళ్ళ పట్ల భక్తి చాలు అని అన్వయించుకుంటే తప్పు ఎక్కడ?

విప్లవ్</description>
		<content:encoded><![CDATA[<p>భూషణ్ గారు కోట్ చేసిన పేరా తరువాత అదే తెలుగు నాడిలో వెల్చేరు గారు ఒక వాక్యం రాసారు: &#8220;ఇదీ ఈ పద్యానికి పైకి కనిపించే అర్ధం.&#8221; అని.</p>
<p>ఆ తరువాత ఎలా అర్ధం చేసుకోవాలో చెబుతూ, పండితులు కవులు రాజాశ్రయం కోసం వస్తారు &#8230; వాళ్ళకు అగ్రహారాలూ, అక్షర లక్షలూ ఇవ్వక్కరలేదు &#8230; అంటూ కనీసం రెండు రకాలుగా అర్ధాలు చెప్పారు (సంపాదకులు ఆ పూర్తి వ్యాసం అందరికీ అందుబాటులో ఉండేలా చూడటం వల్ల నష్టం లేదు అనుకుంటాను, ముఖ్యంగా ఆ శీర్షిక పేరు: &#8220;ఒక తెలుగు పద్యాన్ని పరిచయం చేసే శీర్షిక&#8221; అన్న విషయంతో సహా).</p>
<p>అయినా ఇంత చిన్న పరిచయానికే &#8220;కృష్ణరాయల కీర్తికే కళంకం&#8221; వచ్చేట్లయితే, ఆ కీర్తి ఆనుపానుల మీద నిజంగా డౌటు వచ్చి తీరాలి.</p>
<p>నాదొక సందేహం:</p>
<p>(అన్ని వ్యాఖ్యలనూ పక్కకు పెట్టి నాకు నేను అర్ధం చేసుకోవటానికి ప్రయత్నం చేసాను).<br />
ఇది ఒక ఉపమానం అయి ఉండవచ్చా: పండితులకూ, భిక్షులకూ ఊళ్ళు పంచి ఇస్తే &#8212; ముఖ్యంగా డబ్బు దస్కం, ఈ రెండు కులాల వారిని కులభ్రష్టులుగా మిగులుస్తుంది, అందుకే వాళ్ళ పట్ల భక్తి చాలు అని అన్వయించుకుంటే తప్పు ఎక్కడ?</p>
<p>విప్లవ్
</p>
]]></content:encoded>
				</item>
	<item>
		<title>by: K.V.S. Ramarao</title>
		<link>http://www.eemaata.com/em/issues/200605/80.html#comment-73</link>
		<pubDate>Sun, 07 May 2006 00:59:45 +0000</pubDate>
		<guid>http://www.eemaata.com/em/issues/200605/80.html#comment-73</guid>
					<description>వెంకటరత్నంబాబు గారు ఇచ్చిన reference చాలా ఉపయోగకరమైంది. అందుకు వారికి కృతజ్ఞతలు. ఆ వెబ్ సైట్ లో అల్లసాని పెద్దన దానాలను వివరించే శాసనాలు మూడున్నాయి. అవి 65, 66, 68 అంకెలవి. ఆ లింక్ ఇది - http://www.whatisindia.com/inscriptions/south_indian_inscriptions/volume_16/stones_51_to_75.html

ఐతే ఈ శాసనాలు చెప్పే సీమలు పెద్దనకు ఎవరు ఇచ్చారో, ఎందుకు ఇచ్చారో ఇవి చెప్పవు. కృష్ణరాయల అధికారంలో వున్నాయని, పెద్దనకు వాటి మీద కొన్నిరకాల హక్కులున్నాయని చెప్తాయి గాని అంతమాత్రం చేత రాయలే అవి ఇచ్చి వుండనక్కర్లేదు. అంతకు ముందు పాలించిన వీరనరసింహుడో సాలువ నరసింహుడో ఐనా ఐవుండొచ్చు. ఏమైనా, ఈ సైట్ గురించి మనందరికీ చెప్పిన వెంకటరత్నంబాబు గారికి మళ్లీ కృతజ్ఞతలు.</description>
		<content:encoded><![CDATA[<p>వెంకటరత్నంబాబు గారు ఇచ్చిన reference చాలా ఉపయోగకరమైంది. అందుకు వారికి కృతజ్ఞతలు. ఆ వెబ్ సైట్ లో అల్లసాని పెద్దన దానాలను వివరించే శాసనాలు మూడున్నాయి. అవి 65, 66, 68 అంకెలవి. ఆ లింక్ ఇది - <a href='http://www.whatisindia.com/inscriptions/south_indian_inscriptions/volume_16/stones_51_to_75.html' rel='nofollow'>http://www.whatisindia.com/inscriptions/south_indian_inscriptions/volume_16/stones_51_to_75.html</a></p>
<p>ఐతే ఈ శాసనాలు చెప్పే సీమలు పెద్దనకు ఎవరు ఇచ్చారో, ఎందుకు ఇచ్చారో ఇవి చెప్పవు. కృష్ణరాయల అధికారంలో వున్నాయని, పెద్దనకు వాటి మీద కొన్నిరకాల హక్కులున్నాయని చెప్తాయి గాని అంతమాత్రం చేత రాయలే అవి ఇచ్చి వుండనక్కర్లేదు. అంతకు ముందు పాలించిన వీరనరసింహుడో సాలువ నరసింహుడో ఐనా ఐవుండొచ్చు. ఏమైనా, ఈ సైట్ గురించి మనందరికీ చెప్పిన వెంకటరత్నంబాబు గారికి మళ్లీ కృతజ్ఞతలు.
</p>
]]></content:encoded>
				</item>
	<item>
		<title>by: K.V.S. Ramarao</title>
		<link>http://www.eemaata.com/em/issues/200605/80.html#comment-72</link>
		<pubDate>Sat, 06 May 2006 21:47:09 +0000</pubDate>
		<guid>http://www.eemaata.com/em/issues/200605/80.html#comment-72</guid>
					<description>ఒక రచననీ దాని రచయితనీ వేరుగా చూడగలగటం విమర్శకుడి తొలికర్తవ్యం. అలాకానప్పుడు అసలు విషయాన్ని కూడ అనవసర వ్యక్తిగత ప్రసక్తితో కలిపి అవతలపారెయ్యటం జరుగుతుంది.

ఇకపోతే ఇక్కడ వున్న విషయం &quot;నిర్ణయాలు (లేదా సిద్ధాంతాలు) శాస్త్రీయంగా (అంటే scientific గా) సాధారాలు, సహేతుకాలు ఐన మార్గాల ద్వారా సాధించారా లేక వట్టి ఊకదంపుడు ద్వారానా&quot; అన్నది. మరో ముఖ్యమైన విషయం - ఒక నిర్ణయం సాధించటానికి ఇంతశ్రమ అవసరంఐతే ఒక సందేహం లేవనెత్తటానికి ఉన్న ప్రమాణం ఇంతకన్న చాలా తక్కువ అనేది. ఒక సిద్ధాంతాన్ని disprove చెయ్యటానికి ఒక counter-example సరిపోయినట్లు ఒక సందేహం లేవనెత్తటానికి ఒక ఆధారం చాలు.

వెల్చేరు గారు చేసినది నా దృష్టిలో అలాటిపని. ఆయన పరిశోధకుడు. పరిశోధకుల పని ప్రశ్నలు వెయ్యటం, సందేహాలు రేపటం. అలాకాకుండా అదివరకు అందరూ నడుస్తున్న దారినే కళ్లుమూసుకుని వెళ్లేవారు పరిశోధకులు కారు; వారి వృత్తికే అన్యాయం చేసినవారు. ప్రచారంలో వున్న నమ్మకాల్ని ప్రశ్నించి అవి శాస్త్రీయంగా సమర్ధనీయాలే అని రుజువు చెయ్యటం పరిశోధకుల పని. అదివరకు చూడని కొత్తకోణాలున్నాయేమోనని వెదకటం వారి కర్తవ్యం. అలా చేసినప్పుడే చర్చలు, వాటిద్వారా కొత్తవిషయాలు వెలికిరావటమూ జరుగుతాయి. ఒకానొకచో కొత్తవిషయాలు రాకపోయినా పాతవాటినే కొత్తవిధంగా చూడటం ఐనా జరుగుతుంది . ఇదీ ఆధునిక పరిశోధనా మార్గం.

నిజానికి ఈ సందర్భంలో ఇప్పుడు జరుగుతున్నదీ అదే కదా - ఆయన ఆ సందేహం వెలిబుచ్చబట్టే ఇంత చర్చా సాధ్యమైంది.</description>
		<content:encoded><![CDATA[<p>ఒక రచననీ దాని రచయితనీ వేరుగా చూడగలగటం విమర్శకుడి తొలికర్తవ్యం. అలాకానప్పుడు అసలు విషయాన్ని కూడ అనవసర వ్యక్తిగత ప్రసక్తితో కలిపి అవతలపారెయ్యటం జరుగుతుంది.</p>
<p>ఇకపోతే ఇక్కడ వున్న విషయం &#8220;నిర్ణయాలు (లేదా సిద్ధాంతాలు) శాస్త్రీయంగా (అంటే scientific గా) సాధారాలు, సహేతుకాలు ఐన మార్గాల ద్వారా సాధించారా లేక వట్టి ఊకదంపుడు ద్వారానా&#8221; అన్నది. మరో ముఖ్యమైన విషయం - ఒక నిర్ణయం సాధించటానికి ఇంతశ్రమ అవసరంఐతే ఒక సందేహం లేవనెత్తటానికి ఉన్న ప్రమాణం ఇంతకన్న చాలా తక్కువ అనేది. ఒక సిద్ధాంతాన్ని disprove చెయ్యటానికి ఒక counter-example సరిపోయినట్లు ఒక సందేహం లేవనెత్తటానికి ఒక ఆధారం చాలు.</p>
<p>వెల్చేరు గారు చేసినది నా దృష్టిలో అలాటిపని. ఆయన పరిశోధకుడు. పరిశోధకుల పని ప్రశ్నలు వెయ్యటం, సందేహాలు రేపటం. అలాకాకుండా అదివరకు అందరూ నడుస్తున్న దారినే కళ్లుమూసుకుని వెళ్లేవారు పరిశోధకులు కారు; వారి వృత్తికే అన్యాయం చేసినవారు. ప్రచారంలో వున్న నమ్మకాల్ని ప్రశ్నించి అవి శాస్త్రీయంగా సమర్ధనీయాలే అని రుజువు చెయ్యటం పరిశోధకుల పని. అదివరకు చూడని కొత్తకోణాలున్నాయేమోనని వెదకటం వారి కర్తవ్యం. అలా చేసినప్పుడే చర్చలు, వాటిద్వారా కొత్తవిషయాలు వెలికిరావటమూ జరుగుతాయి. ఒకానొకచో కొత్తవిషయాలు రాకపోయినా పాతవాటినే కొత్తవిధంగా చూడటం ఐనా జరుగుతుంది . ఇదీ ఆధునిక పరిశోధనా మార్గం.</p>
<p>నిజానికి ఈ సందర్భంలో ఇప్పుడు జరుగుతున్నదీ అదే కదా - ఆయన ఆ సందేహం వెలిబుచ్చబట్టే ఇంత చర్చా సాధ్యమైంది.
</p>
]]></content:encoded>
				</item>
	<item>
		<title>by: kari venkataratnam babu</title>
		<link>http://www.eemaata.com/em/issues/200605/80.html#comment-63</link>
		<pubDate>Fri, 05 May 2006 20:00:27 +0000</pubDate>
		<guid>http://www.eemaata.com/em/issues/200605/80.html#comment-63</guid>
					<description>అల్ల సాని పెద్దన కు సంబంధిచిన inscriptions whatisindia.com లొ చదివితిని.అవి రాయలసీమ ప్రాంతానివి.పెద్దన కు దానమీయబడిన భూములు వివరాలు వున్నాయి.రిసెర్చి కి చాల అనుకూలమయిన వెబ్ .</description>
		<content:encoded><![CDATA[<p>అల్ల సాని పెద్దన కు సంబంధిచిన inscriptions whatisindia.com లొ చదివితిని.అవి రాయలసీమ ప్రాంతానివి.పెద్దన కు దానమీయబడిన భూములు వివరాలు వున్నాయి.రిసెర్చి కి చాల అనుకూలమయిన వెబ్ .
</p>
]]></content:encoded>
				</item>
	<item>
		<title>by: తమ్మినేని యదుకుల భూషణ్.</title>
		<link>http://www.eemaata.com/em/issues/200605/80.html#comment-59</link>
		<pubDate>Fri, 05 May 2006 07:22:25 +0000</pubDate>
		<guid>http://www.eemaata.com/em/issues/200605/80.html#comment-59</guid>
					<description>(Part of this post is edited by eemaaTa editors due to its insensitive, unprofessional, loose, indecent and unwarranted tirades against an individual. Such behavior is inconsistent with the literary discourse this magazine is dedicated to encourage. Though our policy has been to allow free discussions on topics published here, this is a sad exception we do not wish to be a frequent occurrence.)

...... రామారావు గారి వ్యాసం చక్కగా ఉంది.
కానీ రాయల వైష్ణవం ఆయన పరమత అసహనం లాంటివి
ఎక్కువ సాగదీసి నట్టు ఉన్నాయి.అప్పుడు బౌద్ధులు ,జైనులు
దక్షిణాదిలో అంత ప్రబలంగా వున్నట్టు కనబడదు.భక్తియె
చాలు అన్న మాటను మరువకూడదు..రాయలు భిక్షువులను అంతగా
విడదీసి చూడలేదు.రాజనీతి తెలిసినవాడు ఆ మాత్రం ఔదార్యం
ప్రదర్శించకుండా వుండడు.దీన్ని వదిలేస్తే మిగిలిన అన్ని విషయాలు
నిర్దుష్టంగా వున్నాయి..ఎక్కడా వికల్పానికి లోను కాలేదు.
----------------------------
Forgotten Empire- Dos Reis de Bisnaga అన్న పోర్చుగీసు
ప్రచురణకు తొలి అనువాదం.ఇటీవల Dr.Vasundhara Filliozat,Paris
University సంకలించిన Vijayanagar as seen by Dorningos Paes
and Fernao Nunitz and others అన్నది ప్రశస్త రచన.పోర్చుగీసు వారివే
కాక ఇటలీ యాత్రికుల కథనాలు ఉన్నాయి. Burton Stein రాసిన Vijayanagara
కూడా ఎన్నదగిన గ్రంథమే. తెలుగులో రాళ్ళపల్లి, పుట్టపర్తి వారు విజయనగరచరిత్ర గూర్చి కంఠదఘ్నంగా వచించివున్నారు;వీరి బహుభాషా పాండిత్యం విశ్రుతపూర్వమే..

తమ్మినేని యదుకుల భూషణ్.</description>
		<content:encoded><![CDATA[<p>(Part of this post is edited by eemaaTa editors due to its insensitive, unprofessional, loose, indecent and unwarranted tirades against an individual. Such behavior is inconsistent with the literary discourse this magazine is dedicated to encourage. Though our policy has been to allow free discussions on topics published here, this is a sad exception we do not wish to be a frequent occurrence.)</p>
<p>&#8230;&#8230; రామారావు గారి వ్యాసం చక్కగా ఉంది.<br />
కానీ రాయల వైష్ణవం ఆయన పరమత అసహనం లాంటివి<br />
ఎక్కువ సాగదీసి నట్టు ఉన్నాయి.అప్పుడు బౌద్ధులు ,జైనులు<br />
దక్షిణాదిలో అంత ప్రబలంగా వున్నట్టు కనబడదు.భక్తియె<br />
చాలు అన్న మాటను మరువకూడదు..రాయలు భిక్షువులను అంతగా<br />
విడదీసి చూడలేదు.రాజనీతి తెలిసినవాడు ఆ మాత్రం ఔదార్యం<br />
ప్రదర్శించకుండా వుండడు.దీన్ని వదిలేస్తే మిగిలిన అన్ని విషయాలు<br />
నిర్దుష్టంగా వున్నాయి..ఎక్కడా వికల్పానికి లోను కాలేదు.<br />
&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;&#8212;-<br />
Forgotten Empire- Dos Reis de Bisnaga అన్న పోర్చుగీసు<br />
ప్రచురణకు తొలి అనువాదం.ఇటీవల Dr.Vasundhara Filliozat,Paris<br />
University సంకలించిన Vijayanagar as seen by Dorningos Paes<br />
and Fernao Nunitz and others అన్నది ప్రశస్త రచన.పోర్చుగీసు వారివే<br />
కాక ఇటలీ యాత్రికుల కథనాలు ఉన్నాయి. Burton Stein రాసిన Vijayanagara<br />
కూడా ఎన్నదగిన గ్రంథమే. తెలుగులో రాళ్ళపల్లి, పుట్టపర్తి వారు విజయనగరచరిత్ర గూర్చి కంఠదఘ్నంగా వచించివున్నారు;వీరి బహుభాషా పాండిత్యం విశ్రుతపూర్వమే..</p>
<p>తమ్మినేని యదుకుల భూషణ్.
</p>
]]></content:encoded>
				</item>
	<item>
		<title>by: Kameswara Rao</title>
		<link>http://www.eemaata.com/em/issues/200605/80.html#comment-57</link>
		<pubDate>Thu, 04 May 2006 16:41:01 +0000</pubDate>
		<guid>http://www.eemaata.com/em/issues/200605/80.html#comment-57</guid>
					<description>రాయవాచకం, కృష్ణరాయల విజయం విషయమై రామారావుగారన్నదానితో ఏకీభవిస్తాను. అవి మాత్రమే ఆధారమైతే ఖచ్చితంగా అనుమానించాల్సిందే. రాయలకాలంలో కూడా విదేశీయుడెవరోఅతన్ని దర్శించి, అతని గూర్చి రాసినట్టుఎక్కడోచదివాను. అందులో ఏమైనా ఆధారాలున్నాయేమో?
ఆముక్తమాల్యద కర్త గురించి - రచయిత identityకి సంబంధించి కావ్యన్నుండి internal evidence తీసుకొనే పద్ధతి అంత శాస్త్రీయం కాదేమో! అలా ప్రయత్నించినా, నిజజీవితంలో కృష్ణరాయలు వీర వైష్ణవునిగా కనిపించడు కదా (శైవ దేవాలయాలకిచ్చిన దాన శాసనాల ద్వారా). మరి ఆముక్తమాల్యద కర్త  వీరవైష్ణవిడిగా తోచడా? ఏదేమైనా, తక్కిన వాదనలని బొత్తిగా నిర్హేతుకమని కొట్టిపారేయడం అంత సమంజసంకాదని నా ఉద్డేశం. ఇంతకన్నా దీనిగురించి రాస్తే మళ్ళీ పాత రభసని తిరిగి తోడడమే అవుతుంది. దానివల్ల బహుశా పెద్ద ఉపయోగం లేదు.</description>
		<content:encoded><![CDATA[<p>రాయవాచకం, కృష్ణరాయల విజయం విషయమై రామారావుగారన్నదానితో ఏకీభవిస్తాను. అవి మాత్రమే ఆధారమైతే ఖచ్చితంగా అనుమానించాల్సిందే. రాయలకాలంలో కూడా విదేశీయుడెవరోఅతన్ని దర్శించి, అతని గూర్చి రాసినట్టుఎక్కడోచదివాను. అందులో ఏమైనా ఆధారాలున్నాయేమో?<br />
ఆముక్తమాల్యద కర్త గురించి - రచయిత identityకి సంబంధించి కావ్యన్నుండి internal evidence తీసుకొనే పద్ధతి అంత శాస్త్రీయం కాదేమో! అలా ప్రయత్నించినా, నిజజీవితంలో కృష్ణరాయలు వీర వైష్ణవునిగా కనిపించడు కదా (శైవ దేవాలయాలకిచ్చిన దాన శాసనాల ద్వారా). మరి ఆముక్తమాల్యద కర్త  వీరవైష్ణవిడిగా తోచడా? ఏదేమైనా, తక్కిన వాదనలని బొత్తిగా నిర్హేతుకమని కొట్టిపారేయడం అంత సమంజసంకాదని నా ఉద్డేశం. ఇంతకన్నా దీనిగురించి రాస్తే మళ్ళీ పాత రభసని తిరిగి తోడడమే అవుతుంది. దానివల్ల బహుశా పెద్ద ఉపయోగం లేదు.
</p>
]]></content:encoded>
				</item>
	<item>
		<title>by: విప్లవ్</title>
		<link>http://www.eemaata.com/em/issues/200605/80.html#comment-50</link>
		<pubDate>Wed, 03 May 2006 19:39:18 +0000</pubDate>
		<guid>http://www.eemaata.com/em/issues/200605/80.html#comment-50</guid>
					<description>హిస్టరీ ఛానెల్ ఎక్కువగా చూడ్డంతోటో, గ్రీకు రోమన్ ఇంగ్లీషు వాళ్ళ నాగరికతలు అప్పుడో ఇప్పుడో చదవడంతోటో వచ్చిన చత్వారం వల్ల నాక్కొన్నింటిని (అక్కరలేనివైనా) పట్టుకోటం మరికొన్ని (ఎంత ముఖ్యమైనవైనా) సరే విడిచిపెట్టటం అలవాటైందనుకుంటాను.

If such an important age with rich texts is descended on any people, I view it as a time when the soul of a civilization/tribe or country is found. I have no pretentious use to say: 'we should explore it because it is a matter of a telugu jaati' or whatever that is. If a cross understanding is possible from kannaDa texts of the time, it will enhance the understanding.

ఒక ప్రాంతం లేక దేశం తనకు తాను నాగరికతను ఏర్పరుచుకోవడానికి లిటరేచర్ (గ్రంథాలు, కావ్యాలు, మిగతా Texts) ముఖ్య కారణం అనుకుంటాను. ఆ కాలంలో అంతగా వృద్ధి చెందడానికి ఒక్క రాయలే కాక కావలసినంత విమర్శ, అనువైన వాతావరణం (ఆర్ధికంగా, ముఖ్యంగా) ఉండి ఉండాలి. Art and literature flourish in times of leisure. ఒక రకమైన గ్రంథాలు రావడానికి కారణం వాటికున్న ఆదరణ కూడా కారణమై ఉండవచ్చు (ex. emergence of greek plays during the times when plays were popular among public/specific classes).

These are various angles that should interest the literary historians. I have read very little about that period other than occassional articles about 'raayalu' &amp; I guess my push at this time is to get this going into other areas.

రాయలమీదనుండి, ఆయన భార్యల మీదనుండి, అతని ఒక్కడి కావ్యాదరణ నుండి దృష్ఠి మరల్చి ఒకసారి ఆ కాలపు పన్నుల మీద, పంటల మీద, వర్తకాల మీద, ముఖ్యంగా విద్యా వ్యాసంగాల (వాటిని ప్రభావితం చేసిన వాళ్ళ మీద, అంటే రాయలు, ఆయన దిగ్గజాల మీద కూడా) మీద ఏవైనా పరిశోధనలు చూప గలిగితే, then it becomes a base line understanding, is my humble opinion. I guess I am asking for a shift in primary focus, from 'the importance of a &quot;direct&quot; connection to specific' to 'understanding of the whole'.

Secondly, The understanding of Forgotten Empire is important to reflect on, before it becomes a Lost Empire, to some extent, I guess I am also trying to say:

ఇతిహాసపు చీకటి కోణం
అట్టడుగున పడి కాన్పించని
కథలన్నీ కావాలిప్పుడు!
(అవి కాస్త కథలు కాకపోతే మంచిది).

విప్లవ్</description>
		<content:encoded><![CDATA[<p>హిస్టరీ ఛానెల్ ఎక్కువగా చూడ్డంతోటో, గ్రీకు రోమన్ ఇంగ్లీషు వాళ్ళ నాగరికతలు అప్పుడో ఇప్పుడో చదవడంతోటో వచ్చిన చత్వారం వల్ల నాక్కొన్నింటిని (అక్కరలేనివైనా) పట్టుకోటం మరికొన్ని (ఎంత ముఖ్యమైనవైనా) సరే విడిచిపెట్టటం అలవాటైందనుకుంటాను.</p>
<p>If such an important age with rich texts is descended on any people, I view it as a time when the soul of a civilization/tribe or country is found. I have no pretentious use to say: &#8216;we should explore it because it is a matter of a telugu jaati&#8217; or whatever that is. If a cross understanding is possible from kannaDa texts of the time, it will enhance the understanding.</p>
<p>ఒక ప్రాంతం లేక దేశం తనకు తాను నాగరికతను ఏర్పరుచుకోవడానికి లిటరేచర్ (గ్రంథాలు, కావ్యాలు, మిగతా Texts) ముఖ్య కారణం అనుకుంటాను. ఆ కాలంలో అంతగా వృద్ధి చెందడానికి ఒక్క రాయలే కాక కావలసినంత విమర్శ, అనువైన వాతావరణం (ఆర్ధికంగా, ముఖ్యంగా) ఉండి ఉండాలి. Art and literature flourish in times of leisure. ఒక రకమైన గ్రంథాలు రావడానికి కారణం వాటికున్న ఆదరణ కూడా కారణమై ఉండవచ్చు (ex. emergence of greek plays during the times when plays were popular among public/specific classes).</p>
<p>These are various angles that should interest the literary historians. I have read very little about that period other than occassional articles about &#8216;raayalu&#8217; &#038; I guess my push at this time is to get this going into other areas.</p>
<p>రాయలమీదనుండి, ఆయన భార్యల మీదనుండి, అతని ఒక్కడి కావ్యాదరణ నుండి దృష్ఠి మరల్చి ఒకసారి ఆ కాలపు పన్నుల మీద, పంటల మీద, వర్తకాల మీద, ముఖ్యంగా విద్యా వ్యాసంగాల (వాటిని ప్రభావితం చేసిన వాళ్ళ మీద, అంటే రాయలు, ఆయన దిగ్గజాల మీద కూడా) మీద ఏవైనా పరిశోధనలు చూప గలిగితే, then it becomes a base line understanding, is my humble opinion. I guess I am asking for a shift in primary focus, from &#8216;the importance of a &#8220;direct&#8221; connection to specific&#8217; to &#8216;understanding of the whole&#8217;.</p>
<p>Secondly, The understanding of Forgotten Empire is important to reflect on, before it becomes a Lost Empire, to some extent, I guess I am also trying to say:</p>
<p>ఇతిహాసపు చీకటి కోణం<br />
అట్టడుగున పడి కాన్పించని<br />
కథలన్నీ కావాలిప్పుడు!<br />
(అవి కాస్త కథలు కాకపోతే మంచిది).</p>
<p>విప్లవ్
</p>
]]></content:encoded>
				</item>
	<item>
		<title>by: K.V.S. Ramarao</title>
		<link>http://www.eemaata.com/em/issues/200605/80.html#comment-49</link>
		<pubDate>Wed, 03 May 2006 17:51:28 +0000</pubDate>
		<guid>http://www.eemaata.com/em/issues/200605/80.html#comment-49</guid>
					<description>విప్లవ్, కామేశ్వరరావు గార్ల అభిప్రాయాల పై ఒకటి రెండు మాటలు - 1. రాయవాచకం కాబోయే మంత్రుల కోసం రాసిన ఓ పాఠ్యగ్రంథం. దానికీ వాస్తవ సంఘటనలకీ సంబంధమే లేదు; అలాగే కృష్ణరాయ విజయం పేరు చెప్పినట్లు ఆయన యుద్ధవిజయాల గురించిన కావ్యం; కొన్ని వాస్తవాలున్నా అప్పటికే కృష్ణరాయల mytholozation చాలా దూరం వెళ్లింది. కనుక నిజాల్ని తెలుసుకోవటానికి ఇవి ఆధారాలు కావు. 2. ఆముక్తమాల్యద నిష్పక్షపాతంగా చదివితే అది రాసిన వ్యక్తి ఎలాటివాడో అతని జీవితానుభవాలు ఎలాటివో స్పష్టంగానే తెలుస్తాయి. అది రాయలు కాకుండా మరెవరో రాశారనటం మసి పూసి మారేడు కాయ చెయ్యటమే. చివరగా, ఆకాలాన్ని తెలుగు కవిత్వ చరిత్రలో స్వర్ణయుగం అనటం సమంజసమే - అప్పుడు వచ్చిన అద్భుతకవిత్వం చూడండి - తొలిప్రబంధం మనుచరిత్ర, ప్రబంధాల్లో శిఖరాగ్రస్థాయిని అందుకున్న వసుచరిత్ర; పింగళి సూరన లేఖిని నుంచి కళాపూర్ణోదయం, ప్రభావతీ ప్రద్యుమ్నం, తొలి ద్వ్యర్థికావ్యం రాఘవపాండవీయం; అక్షరశ్లేషకి ప్రాధాన్యత నిచ్చిన రాఘవపాండవీయానికి ప్రతిగా అర్థశ్లేషకు పెద్దపీట వేసిన హరిశ్చంద్రనలోపాఖ్యానం; తిమ్మన పారిజాతాపహరణం, ధూర్జటి కాళహస్తీశ్వర శతకం, కాళహస్తి మహాత్మ్యం; రామకృష్ణుడి పాండురంగమాహాత్మ్యం; రాయల ఆముక్తమాల్యద. తెలుగు పంచకావ్యాలుగా గుర్తించేవాటిలో నాలుగింటిని contribute చేసిన కాలం అది. ఆ తర్వాత నాయక రాజుల కాలంలో ఇంతకన్న ఎక్కువ సంఖ్యలో తెలుగు కావ్యాలు వచ్చినా అవి చాలావరకు ఈ &quot;స్వర్ణయుగం&quot; రచనలు వేసిన బాటలో నడిచినవే.</description>
		<content:encoded><![CDATA[<p>విప్లవ్, కామేశ్వరరావు గార్ల అభిప్రాయాల పై ఒకటి రెండు మాటలు - 1. రాయవాచకం కాబోయే మంత్రుల కోసం రాసిన ఓ పాఠ్యగ్రంథం. దానికీ వాస్తవ సంఘటనలకీ సంబంధమే లేదు; అలాగే కృష్ణరాయ విజయం పేరు చెప్పినట్లు ఆయన యుద్ధవిజయాల గురించిన కావ్యం; కొన్ని వాస్తవాలున్నా అప్పటికే కృష్ణరాయల mytholozation చాలా దూరం వెళ్లింది. కనుక నిజాల్ని తెలుసుకోవటానికి ఇవి ఆధారాలు కావు. 2. ఆముక్తమాల్యద నిష్పక్షపాతంగా చదివితే అది రాసిన వ్యక్తి ఎలాటివాడో అతని జీవితానుభవాలు ఎలాటివో స్పష్టంగానే తెలుస్తాయి. అది రాయలు కాకుండా మరెవరో రాశారనటం మసి పూసి మారేడు కాయ చెయ్యటమే. చివరగా, ఆకాలాన్ని తెలుగు కవిత్వ చరిత్రలో స్వర్ణయుగం అనటం సమంజసమే - అప్పుడు వచ్చిన అద్భుతకవిత్వం చూడండి - తొలిప్రబంధం మనుచరిత్ర, ప్రబంధాల్లో శిఖరాగ్రస్థాయిని అందుకున్న వసుచరిత్ర; పింగళి సూరన లేఖిని నుంచి కళాపూర్ణోదయం, ప్రభావతీ ప్రద్యుమ్నం, తొలి ద్వ్యర్థికావ్యం రాఘవపాండవీయం; అక్షరశ్లేషకి ప్రాధాన్యత నిచ్చిన రాఘవపాండవీయానికి ప్రతిగా అర్థశ్లేషకు పెద్దపీట వేసిన హరిశ్చంద్రనలోపాఖ్యానం; తిమ్మన పారిజాతాపహరణం, ధూర్జటి కాళహస్తీశ్వర శతకం, కాళహస్తి మహాత్మ్యం; రామకృష్ణుడి పాండురంగమాహాత్మ్యం; రాయల ఆముక్తమాల్యద. తెలుగు పంచకావ్యాలుగా గుర్తించేవాటిలో నాలుగింటిని contribute చేసిన కాలం అది. ఆ తర్వాత నాయక రాజుల కాలంలో ఇంతకన్న ఎక్కువ సంఖ్యలో తెలుగు కావ్యాలు వచ్చినా అవి చాలావరకు ఈ &#8220;స్వర్ణయుగం&#8221; రచనలు వేసిన బాటలో నడిచినవే.
</p>
]]></content:encoded>
				</item>
	<item>
		<title>by: kAmESwara rAvu</title>
		<link>http://www.eemaata.com/em/issues/200605/80.html#comment-48</link>
		<pubDate>Wed, 03 May 2006 17:00:49 +0000</pubDate>
		<guid>http://www.eemaata.com/em/issues/200605/80.html#comment-48</guid>
					<description>1. కృష్ణరాయలు తన కవితాసక్తిని బహిరంగంగా ప్రదర్శించాడా, అతడు కవి పోషకుడా? 
ఈ ప్రశ్నకి &quot;ప్రదర్శించాడు&quot; అని సమాధానం చెప్పుకోడానికి పెద్ద సందేహపడక్కరలేదు. పెద్దన, తిమ్మన్న కావ్యాలే కాకుండా, రాయవాచకం, కృష్ణరాయవిజయం కూడా ఇందుకు సాక్ష్యాలే. అయితే కవులపేర ఏమైనా భూములిచ్చినట్టుగా శాసనాలు ఉన్నాయా అంటే అనుమానమే. నారాయణరావుగారు ఉదహరించిన ఆముక్తమాల్యదలోని పద్యం అతని కవి పోషకత్వాన్ని అనుమానించడానికి అడ్డురాదు. అందులో ప్రస్తావించినది కవులగూర్చి కాకపోవడానికే ఎక్కువ అవకాశం ఉంది. కవులని భిక్షువులుగా జటాధారులుగా ప్రస్తావించడం సబబుగాలేదు. అలా అని రామారావుగారన్న బౌద్ధులు, శైవులు, జైనులు అవడానికి కూడా అవకాశం లేదని నా ఉద్దేశం. వైష్ణవుడైన కృష్ణదేవరాయలు వాళ్ళని డబ్బులిచ్చి మార్చెస్తే, ధర్మగ్లాని అవుతుందని ఎందుకంటాడు? పైగా వాళ్ళమీద భక్తి చూపించమని ఎందుకంటాడు. కాబట్టి వాళ్ళు ప్రత్యేకించి బౌద్ధ భిక్షువులో, శైవులో కాదు. వేదం వారి వ్యాఖ్య ప్రకారం, వాళ్ళు సన్యాసులు. &quot;అక్షరం&quot; అంటే (నాశనం కాని, ఆధ్యాత్మిక)విద్య. 
2. కృష్ణరాయలు స్వయంగా కవా?
ఇది చాలా controversial ప్రశ్న. దీని గురించి చాలామంది పెద్దలు వాదులాడుకున్నారు. ఆముక్తమాల్యద పెద్దన్న కృతమని చాలా రుజువులే చూపించారు. వీటన్నిటిని వేదం వేంకటరాయశాస్త్రిగారు తన ఆముక్తమాల్యదకి రాసిన సంజీవనీ వ్యాఖ్య పీఠికలో చర్చించారు. తెనాలి రామకృష్ణునిదిగా చెప్పబడుతున్న చాటువు, కోకట గ్రామ కైఫీయతు (ఇందులో ఈ గ్రామాన్ని రాయలు పెద్దనకి దానం చేసినట్టు ఉందిట), అప్పకవి పద్యమూ, గుడుపాటి వేంకటకవిదిగా చెప్పబడుతున్న ఆముక్తమాల్యద టీకా... ఇవన్నీ ఆముక్తమాల్యద కర్త అల్లసాని పెద్దనగా పేర్కొన్నాయి. అంతేకాక, ఆముక్తమాల్యదలో కృష్ణరాయల కృతమని పేర్కొన బడ్డ కొన్ని సంస్కృత కావ్యాలు, &quot;ప్రపంచదర్పణమ్&quot; అనే పుస్తకంలో అల్లసాని పెద్దనవిగా పేర్కొనడ్డాయి. అంతేకాక రాయవాచకమూ, కృష్ణరాయ విజయమూ ఆముక్తమాల్యదని పేర్కొనకపోవడం మరింత అనుమానాన్ని కలిగిస్తుంది.
3. అష్టదిగ్గజాలు అసలు ఉన్నారా లేరా ?
దీనికి సమాధానం సబహుశా లేరనే చెప్పాలి. ఉన్నారని బలమైన సాక్ష్యం ఏదీ లేదుకాబట్టి. అష్టదిగ్గజాలుగా చెప్పబడుతున్న కవుల కావ్యాలలో కాని, రాయవాచకం, కృష్ణరాయవిజయం వంటి కావ్యాలలో కాని వీరి ప్రస్తావన లేదు. ఉన్న ఒకే ఒక చిన్న ఆధారం, కడప మండలంలోని తిప్పలూరు గ్రామ శిలాశాసనంలో అష్టదిగ్గజాల ప్రస్తావన.

విప్లవ్ గారి సందేహానికి సమాధానం, చాలా ప్రబంధాలు రాయలకాలంలోవిగా నిర్ణయించబట్టే ఆ కాలాన్ని ప్రబంధయుగం అన్నారు. అయితే వాటికీ కృష్ణరాయల కవిపోషకత్వానికీ ఎంతవరకూ direct సంబంధమున్నదన్నదే ప్రశ్న.</description>
		<content:encoded><![CDATA[<p>1. కృష్ణరాయలు తన కవితాసక్తిని బహిరంగంగా ప్రదర్శించాడా, అతడు కవి పోషకుడా?<br />
ఈ ప్రశ్నకి &#8220;ప్రదర్శించాడు&#8221; అని సమాధానం చెప్పుకోడానికి పెద్ద సందేహపడక్కరలేదు. పెద్దన, తిమ్మన్న కావ్యాలే కాకుండా, రాయవాచకం, కృష్ణరాయవిజయం కూడా ఇందుకు సాక్ష్యాలే. అయితే కవులపేర ఏమైనా భూములిచ్చినట్టుగా శాసనాలు ఉన్నాయా అంటే అనుమానమే. నారాయణరావుగారు ఉదహరించిన ఆముక్తమాల్యదలోని పద్యం అతని కవి పోషకత్వాన్ని అనుమానించడానికి అడ్డురాదు. అందులో ప్రస్తావించినది కవులగూర్చి కాకపోవడానికే ఎక్కువ అవకాశం ఉంది. కవులని భిక్షువులుగా జటాధారులుగా ప్రస్తావించడం సబబుగాలేదు. అలా అని రామారావుగారన్న బౌద్ధులు, శైవులు, జైనులు అవడానికి కూడా అవకాశం లేదని నా ఉద్దేశం. వైష్ణవుడైన కృష్ణదేవరాయలు వాళ్ళని డబ్బులిచ్చి మార్చెస్తే, ధర్మగ్లాని అవుతుందని ఎందుకంటాడు? పైగా వాళ్ళమీద భక్తి చూపించమని ఎందుకంటాడు. కాబట్టి వాళ్ళు ప్రత్యేకించి బౌద్ధ భిక్షువులో, శైవులో కాదు. వేదం వారి వ్యాఖ్య ప్రకారం, వాళ్ళు సన్యాసులు. &#8220;అక్షరం&#8221; అంటే (నాశనం కాని, ఆధ్యాత్మిక)విద్య.<br />
2. కృష్ణరాయలు స్వయంగా కవా?<br />
ఇది చాలా controversial ప్రశ్న. దీని గురించి చాలామంది పెద్దలు వాదులాడుకున్నారు. ఆముక్తమాల్యద పెద్దన్న కృతమని చాలా రుజువులే చూపించారు. వీటన్నిటిని వేదం వేంకటరాయశాస్త్రిగారు తన ఆముక్తమాల్యదకి రాసిన సంజీవనీ వ్యాఖ్య పీఠికలో చర్చించారు. తెనాలి రామకృష్ణునిదిగా చెప్పబడుతున్న చాటువు, కోకట గ్రామ కైఫీయతు (ఇందులో ఈ గ్రామాన్ని రాయలు పెద్దనకి దానం చేసినట్టు ఉందిట), అప్పకవి పద్యమూ, గుడుపాటి వేంకటకవిదిగా చెప్పబడుతున్న ఆముక్తమాల్యద టీకా&#8230; ఇవన్నీ ఆముక్తమాల్యద కర్త అల్లసాని పెద్దనగా పేర్కొన్నాయి. అంతేకాక, ఆముక్తమాల్యదలో కృష్ణరాయల కృతమని పేర్కొన బడ్డ కొన్ని సంస్కృత కావ్యాలు, &#8220;ప్రపంచదర్పణమ్&#8221; అనే పుస్తకంలో అల్లసాని పెద్దనవిగా పేర్కొనడ్డాయి. అంతేకాక రాయవాచకమూ, కృష్ణరాయ విజయమూ ఆముక్తమాల్యదని పేర్కొనకపోవడం మరింత అనుమానాన్ని కలిగిస్తుంది.<br />
3. అష్టదిగ్గజాలు అసలు ఉన్నారా లేరా ?<br />
దీనికి సమాధానం సబహుశా లేరనే చెప్పాలి. ఉన్నారని బలమైన సాక్ష్యం ఏదీ లేదుకాబట్టి. అష్టదిగ్గజాలుగా చెప్పబడుతున్న కవుల కావ్యాలలో కాని, రాయవాచకం, కృష్ణరాయవిజయం వంటి కావ్యాలలో కాని వీరి ప్రస్తావన లేదు. ఉన్న ఒకే ఒక చిన్న ఆధారం, కడప మండలంలోని తిప్పలూరు గ్రామ శిలాశాసనంలో అష్టదిగ్గజాల ప్రస్తావన.</p>
<p>విప్లవ్ గారి సందేహానికి సమాధానం, చాలా ప్రబంధాలు రాయలకాలంలోవిగా నిర్ణయించబట్టే ఆ కాలాన్ని ప్రబంధయుగం అన్నారు. అయితే వాటికీ కృష్ణరాయల కవిపోషకత్వానికీ ఎంతవరకూ direct సంబంధమున్నదన్నదే ప్రశ్న.
</p>
]]></content:encoded>
				</item>
	<item>
		<title>by: విప్లవ్</title>
		<link>http://www.eemaata.com/em/issues/200605/80.html#comment-39</link>
		<pubDate>Tue, 02 May 2006 18:45:59 +0000</pubDate>
		<guid>http://www.eemaata.com/em/issues/200605/80.html#comment-39</guid>
					<description>రాయలు కవి పోషకుడా కాదా అన్నది academic.  అది తేల్చినందు వల్ల నాకు పెద్దగా ఉపయోగం లేదు.  కానీ, రాయల కాలంలో రాసిన కావ్యాలు, రచనలు, అవి చేసినవాళ్ళతో సహా, ఇప్పటి దాకా తెలిసినవి ఒక లిస్టు ఉంటే ఇవ్వండి.  ఒక వేళ సాహిత్యం ఆయన కాలంలో (మిగతా సమయాలతో పోల్చుకుంటే) disproportionate గా వచ్చి ఉంటే దానికర్ధం, ఏదో ఒక incentive ఆ కాలంలో సాధ్యమైందనే నేననుకుంటాను.

చరిత్రలో మిగిలిన గ్రంథాలను, వాటి ఈ విషయం తేల్చి చెప్పగల వాళ్ళు ఒక &quot;సమయ&quot; నిర్ధారణ సాధ్యమైనంతలో చేయగలిగితే అది చాలు మొదటి మెట్టుగా.  

ఈ వ్యాసం చాలా శ్రమ తీసుకుని రాసింది, కొత్త ఆలోచనలు రేకెత్తించేదిగా ఉంది.  నా.రా. గారి (తెలుగునాడి) వ్యాసం కూడా మరో లింకుతో ఇచ్చి ఉంటే బాగుండేదేమో.</description>
		<content:encoded><![CDATA[<p>రాయలు కవి పోషకుడా కాదా అన్నది academic.  అది తేల్చినందు వల్ల నాకు పెద్దగా ఉపయోగం లేదు.  కానీ, రాయల కాలంలో రాసిన కావ్యాలు, రచనలు, అవి చేసినవాళ్ళతో సహా, ఇప్పటి దాకా తెలిసినవి ఒక లిస్టు ఉంటే ఇవ్వండి.  ఒక వేళ సాహిత్యం ఆయన కాలంలో (మిగతా సమయాలతో పోల్చుకుంటే) disproportionate గా వచ్చి ఉంటే దానికర్ధం, ఏదో ఒక incentive ఆ కాలంలో సాధ్యమైందనే నేననుకుంటాను.</p>
<p>చరిత్రలో మిగిలిన గ్రంథాలను, వాటి ఈ విషయం తేల్చి చెప్పగల వాళ్ళు ఒక &#8220;సమయ&#8221; నిర్ధారణ సాధ్యమైనంతలో చేయగలిగితే అది చాలు మొదటి మెట్టుగా.  </p>
<p>ఈ వ్యాసం చాలా శ్రమ తీసుకుని రాసింది, కొత్త ఆలోచనలు రేకెత్తించేదిగా ఉంది.  నా.రా. గారి (తెలుగునాడి) వ్యాసం కూడా మరో లింకుతో ఇచ్చి ఉంటే బాగుండేదేమో.
</p>
]]></content:encoded>
				</item>
</channel>
</rss>
