అయ్యగారు ఖద్దరు పంచె, లాల్చీ ధరించి, నుదుట బొట్టు పెట్టుకుని కూర్చుని ఉండేవాడు. మధ్యమధ్యలో ముక్కుపొడి పీల్చేవాడు. మధ్యాహ్నానికి ఇంటి నుంచి అమ్మగారు పంపిన రసం అక్కడే తాగేవాడు. ముక్కుపొడి, రసం, వైద్యం, ఊరి కబుర్లు—అన్నీ ఆ దర్బారులోనే, అందరి కళ్లముందే.
శీర్షికలు వ్యాసాలు
ఇక్కడ నేను “చంద్రరేఖా విలాపం”లో హాస్యప్రబంధం కావటానికి కావలసిన సామాగ్రి పుష్కలంగా వుందని చూపిస్తాను. కనుక అది నిజంగా, కవి స్వయంగా చెప్పుకున్నట్టు హాస్యప్రబంధమే అని నా వాదన.
వేమన, వీరబ్రహ్మం ఇద్దరిదీ దాదాపు ఒకటే మార్గం. దీన్ని అద్భుతంగా ప్రదర్శించే గ్రంథం “కాళికాంబ సప్తశతి”. వీరబ్రహ్మం ఆధ్యాత్మిక జీవితం ద్వారా సమాజంలో ఎలాంటి మార్పు కోరుకున్నాడో, కులమతాల అసమానతలను ఎలా ఎత్తిచూపారో ఈ శతక పద్యాల ద్వారా తెలుసుకోవచ్చు.
ఎఱ్ఱదాచమ నాయని విక్రమగాథను చిత్రీకరించిన యాచ ప్రబంధము కావ్యకర్త దేవరకొండ నివాసి త్రిపురాంతకుడు, అక్కడికి సమీపాననే ఉన్న ఓరుగల్లులో కాకతీయ సామ్రాజ్య సామాజిక స్థితిగతులను వర్ణించిన ప్రేమాభిరామము కావ్యకర్త అయిన రావిపాటి త్రిపురాంతకుడు ఒకే కాలంలో, ఒకే ప్రాంతంలో ఉండి సంస్కృతంలో కావ్యరచన చేసిన ఇద్దఱు వేర్వేఱు వ్యక్తులని భావించటం కంటే యాచ ప్రబంధము సుప్రసిద్ధుడైన రావిపాటి త్రిపురాంతకుని రచనమని భావించటమే సమంజసంగా ఉంటుంది.
నేను ఎన్నో రకాల రేడియోధార్మిక రూపాంతరాలు చూశాను. కానీ వాటన్నిటికన్నా వేగంగా జరిగిన రూపాంతరం—ఒక్క క్షణంలో నేను భౌతికశాస్త్రవేత్త నుంచి రసాయనశాస్త్రవేత్తగా మారిపోవడమే!
భూమి ఎక్కడో సముద్రమెక్కడో తెలియని భూ-జల ప్రపంచంలో ఒక గమ్యమంటూ లేకుండా పడవ ప్రయాణం. ఎదురుగా పచ్చని కొండలు… కొండల నడుమ ఏభై గజాల ‘ఇరుకు’ జలసంధులు… అవతల అనంతసాగరం. ద్వీపాలలో చిక్కని అడవులు… చేపల పడవలు.. అలలు లేని జలధి…
ప్రసిద్ధ భౌతికశాస్త్ర చరిత్రకారుడు అబ్రహం పైస్ (Abraham Pais), “ప్లాంక్, ఐన్స్టైన్, బోర్ల ప్రసిద్ధ పరిశోధనల తర్వాత, పాత క్వాంటం సిద్ధాంతాన్ని పరిపూర్ణం చేస్తూ వచ్చిన పరిశోధనా పత్రాలలో నాలుగోది, చివరిది, విప్లవాత్మకమైనది బోస్ రాసినదే” అన్నాడు.
ఈ దృష్టితో చదివినప్పుడు రాధికాసాంత్వనం ఒక శృంగార కావ్యంగా మాత్రమే కనిపించదు. అది ఒక కవి, ఒక కథ, ఒక దైవం, ఒక నాయకురాలు, ఒక సహృదయ పాఠకుడు — వీరందరి మధ్య ఏర్పడే సాహిత్య అనుభవంగా కనిపిస్తుంది.
త్రిపురాంతకోదాహరణము, అంబికా శతకము, చంద్ర తారావళి అన్న మూడు కావ్యాలలోనూ “ఇది రావిపాటి త్రిపురాంతకుని కృతి” అని చెప్పటానికి నికరమైన ఆధారమేమీ లేదు. సంపూర్ణంగా దొరికిన త్రిపురాంతకోదాహరణము లోనూ కృత్యాద్యంతాలలో ఎక్కడా రావిపాటి త్రిపురాంతకుడని కర్తృనామం చెప్పబడలేదు.
సంపూర్ణ సూర్యగ్రహణం కొన్ని నిమిషాలు మాత్రమే కొనసాగవచ్చు. చంద్రగ్రహణం కొన్ని గంటలు మాత్రమే కొనసాగవచ్చు. కానీ ఆర్యభట నెలకొల్పిన ఖగోళ సంప్రదాయం పదిహేను శతాబ్దాలకు పైగా కొనసాగుతూనే ఉంది. ఆ వారసత్వాన్ని మూఢభక్తితో ఆరాధించడం కంటే, దాని వెనుక ఉన్న శాస్త్రీయ దృష్టిని అర్థం చేసుకుని ముందుకు తీసుకెళ్ళడానికి పునరంకితులము అవడమే మనం వారికి అందించగల నిజమైన నివాళి.
ఒక భాషనుండి మరో భాషలోనికి మార్చుట అంటే చాలా కష్టమైన పని. భాషాంతరీకరణంలో ఎన్నో క్లేశాలుంటాయి. రెండు భాషలలో నిష్ణాతుడు కాకున్నచో ఆ భాషలలోని మెలకువలు తెలియవు. లేకుంటే భాషాంతరానుసృజనం పేలవమైపోతుంది. ఒకప్పుడు విరుద్ధార్థ స్ఫూర్తిని కూడ కలుగజేస్తుంది. మూలగ్రంథం దీర్ఘంగా ఉన్నప్పుడు దాన్నంతా ఆకళించుకొని ముఖ్యాంశాలను త్యజించకుండా అనుసరించాలి. మూలంలోని పదాల్లో అర్థం అస్పష్టంగా, లేదా క్లిష్టంగా ఉన్నప్పుడు దానిని వివరించాలి. పునరుక్తులను పరిహరించాలి. ఆ భాషలోని నుడికారం అర్థం చేసుకొని ఈ భాషకు తగినట్లు నుడికారపు సొంపు నింపుతూ అనుసృజనం చేసినప్పుడే కౌశలం ఏర్పడుతుంది. ఇట్టి లక్షణాలన్నీ తిక్కన భారతంలో దర్శనమిస్తాయి.
కన్నీటి చుక్క ఆకారంలో ఉన్న ద్వీపం కార్ నికోబార్. అంతా సమతల ప్రదేశం. పరిణతిగల రహదారి వ్యవస్థ. ఎటు చూసినా బీచ్లు. ఆ మారుమూల ద్వీపాలలో మనుషుల్ని ఆకర్షించి స్థిరనివాసం ఏర్పాటు చేసుకోమని ప్రేరణ కలిగించే శక్తీ వనరులూ కలది కార్ నికోబారే.
రావిపాటి త్రిపురాంతకుడు మొత్తం ఐదు విశిష్ట గ్రంథాలను ఉదాహరణము, శతకము, తారావళి, శాస్త్రకావ్యము, వీథి అన్న అయిదు విభిన్న ప్రక్రియలలో రచించినట్లు సాహితీవేత్తలు భావిస్తున్నారు.
క్వాంటం ఆవిష్కరణే ఇరవయ్యో శతాబ్దపు భౌతికశాస్త్ర పరిశోధనలన్నింటికీ మూలపునాదిగా మారి, దాని పరిణామాన్ని పూర్తిగా శాసిస్తూ వచ్చింది. ఈ ఆవిష్కరణే లేకపోతే అణువులు, పరమాణువులు, వాటి రూపాంతరాలను నియంత్రించే శక్తి ప్రక్రియల గురించిన ఒక స్పష్టమైన సిద్ధాంతాన్ని నిర్మించడం సాధ్యమయ్యేదే కాదు.
కావ్యాన్ని రచించే కవి అన్ని విధాలా రసానికి లోబడియే ఉండాలి. ఇతివృత్తంలో రసానికి అనుగుణంగా లేని స్థితి కనబడ్డప్పుడు ఆ స్థితిని భంగం చేసి అయినా సరే రసానుగుణంగా వేరే కథను సృజించాలి. కవి కేవలం ఇతివృత్తాన్ని నిర్వహిస్తే, అందువల్ల ఏ ప్రయోజనం కలగదు. నన్నయ భట్టారకుడు భారతమును రసనిర్భరమై ధ్వనివిలసితముగా తీర్చిదిద్దెను.
హైడెగర్ ప్రధానగ్రంథం పేరు, “Being and Time”. Da-sein దేశాన్ని చెబుతోంది. ఈ కల్పితపదం, మనిషి దేశకాలాలకు అతీతమైన తత్త్వం కాడని, మనిషి సక్రియుడని, తన కర్మలచే తనను తాను నిర్మించుకుంటాడని, “బతకడం” మనిషి “ధర్మ”మని, (తత్త్వం కాదని) చెబుతుంది. ఇది హైడెగర్ పదప్రయోగము, అనువాదభాషావిషయము.
రామాయణ, మహాభారతాలు చదవకుండా భారతీయ విలువలను, మనస్తత్త్వాన్ని అర్థం చేసుకోవడం ఎంత కష్టమో అలాగే ఇలియాడ్, ఓడిస్సీ గ్రంథాలు చదవకుండా గ్రీసు దేశపు సంప్రదాయాలనే కాకుండా పాశ్చాత్య సంస్కృతిని, పాశ్చాత్య కళలనూ, పాశ్చాత్య ఆలోచనాసరళిని అర్థం చేసుకోవడం కష్టమే.
దాశరథిని ప్రేమించని సాహిత్యకులు తెలంగాణలో లేరు. దాశరథిచే స్వీకరింపబడని కావ్యవస్తువు తెలంగాణాలో లేదు. దాశరథి గీతాలు వినని రసికులు తెలంగాణమందుండరు. దాశరథియే తెలంగాణము – తెలంగాణమే దాశరథి.
పుంభావసరస్వతిగా విద్వద్గణాలచే కొనియాడబడిన సముద్ధండ పండితులు డా॥ కొరిడె రాజన్న శాస్త్రిగారి సుదీర్ఘ సాహిత్య ప్రస్థానం, కవితా వైభవం మరియు వారి జీవన రేఖల గురించి వారి కుమారులు కొరిడె విశ్వనాథశర్మ గారు అందిస్తున్న పరిచయం.
బాలమురళికి సంగీతం తెలియదనీ, సంగీతానికే బాలమురళి తెలుసనే వారాయన. నాకు సా-పా-సాలు తెలియవు కానీ బాలమురళి తెలుసు.